రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- September 17, 2025
మస్కట్: ఒమన్ ఎయిర్ 2025లో అత్యంత రద్దీగా ఉండే ఖరీఫ్ సీజన్ను రికార్డులతో ముగించింది. జూన్ ప్రారంభం నుండి ఆగస్టు చివరి వరకు రెండు లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఒమన్ ఎయిర్ లో సలాలాకు ప్రయాణించారు. గతేడాది కంటే ప్రయాణికుల సంఖ్య 15శాతం పెరిగింది. ఒమన్ పర్యాటక రంగానికి మద్దతుగా.. దేశీయ ప్రయాణాన్ని సులభతరం చేసినట్టు ఒక ప్రకటనలో ఒమన్ ఎయిర్ వెల్లడించింది.
ఖరీఫ్ సమయంలో 70% కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఒమన్ ఎయిర్ ను ఎంచుకున్నారని, OMR 54 రిటర్న్ ఛార్జీ ఆఫర్ కూడా ఒమన్ ఎయిర్ రికార్డు నమోదులో కీలక పాత్ర పోషిందన్నారు. కాగా OMR 64 ఛార్జీ ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుందని, ఇది సలాలా మరియు మస్కట్ మధ్య ప్రయాణించేవారు దాని నుంచి లాభం పొందాలని ఒమన్ ఎయిర్ గ్లోబల్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అల్ మహరూకి తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఒమన్ సాంస్కృతిక మరియు సహజ వారసత్వాన్ని ప్రోత్సహిస్తామని, ఇన్బౌండ్ పర్యాటకాన్ని పెంచడానికి ముందు వరుసలో ఉంటామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు