పౌరసత్వ చట్టానికి సవరణలు: ఎంపీ
- July 20, 2016
బహ్రెయినీ లా మేకర్, పౌరసత్వ చట్టానికి సవరణలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. మొహమ్మద్ అల్ మర్రి గతంలోనే ఈ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. 1960లో ఇసా ఖాసిమ్కి పౌరసత్వం ఇవ్వడం, ఇటీవలే ఆ పౌరసత్వాన్ని రద్దు చేయాల్సి రావడంతో మొహమ్మద్ అల్ మర్రి పౌరసత్వ చట్ట సవరణ ఆవశ్యక్తపై గళమెత్తారు. ఇసా కాసిమ్, ఇరాన్కి చెందిన వ్యక్తి. అయినప్పటికీ ఆయనకు బహ్రెయిన్ పౌరసత్వం దక్కింది. అయితే ఆ పౌరసత్వాన్ని ఇసా కాసిమ్ దుర్వినియోగం చేశారు. బహ్రెయిన్ వ్యతిరేక చర్యలకు పాల్పడటంతో ఇసా కాసిమ్కి బహ్రెయిన్ పౌరసత్వాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇకపై ఎవరికైనా బహ్రెయిన్ పౌరసత్వం ఇవ్వాలంటే పలు పరీక్షల్లో నెగ్గాల్సి ఉండేలా చట్ట సవరణ చేయాలని ఎంపీ మొహమ్మద్ అల్ మర్రి సూచిస్తున్నారు. బహ్రెయిన్ చరిత్ర, సంస్కృతితోపాటు, బహ్రెయిన్ పట్ల సంపూర్ణ అవగాహన ఉండేలా ఈ పరీక్షల్ని రూపొందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









