పౌరసత్వ చట్టానికి సవరణలు: ఎంపీ
- July 20, 2016
బహ్రెయినీ లా మేకర్, పౌరసత్వ చట్టానికి సవరణలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. మొహమ్మద్ అల్ మర్రి గతంలోనే ఈ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. 1960లో ఇసా ఖాసిమ్కి పౌరసత్వం ఇవ్వడం, ఇటీవలే ఆ పౌరసత్వాన్ని రద్దు చేయాల్సి రావడంతో మొహమ్మద్ అల్ మర్రి పౌరసత్వ చట్ట సవరణ ఆవశ్యక్తపై గళమెత్తారు. ఇసా కాసిమ్, ఇరాన్కి చెందిన వ్యక్తి. అయినప్పటికీ ఆయనకు బహ్రెయిన్ పౌరసత్వం దక్కింది. అయితే ఆ పౌరసత్వాన్ని ఇసా కాసిమ్ దుర్వినియోగం చేశారు. బహ్రెయిన్ వ్యతిరేక చర్యలకు పాల్పడటంతో ఇసా కాసిమ్కి బహ్రెయిన్ పౌరసత్వాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇకపై ఎవరికైనా బహ్రెయిన్ పౌరసత్వం ఇవ్వాలంటే పలు పరీక్షల్లో నెగ్గాల్సి ఉండేలా చట్ట సవరణ చేయాలని ఎంపీ మొహమ్మద్ అల్ మర్రి సూచిస్తున్నారు. బహ్రెయిన్ చరిత్ర, సంస్కృతితోపాటు, బహ్రెయిన్ పట్ల సంపూర్ణ అవగాహన ఉండేలా ఈ పరీక్షల్ని రూపొందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









