తమిళనాడులో కలాం వర్థంతి సందర్భంగా కోటి మొక్కలు
- July 21, 2016
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మొదటి వర్థంతి సందర్భంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. జులై 27న ఆయన వర్థంతి సందర్భంగా తమిళనాడులోని పార్క్ ఇనిస్టిట్యూషన్స్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వీరు కోటి మొక్కలు నాటనున్నారు. జులై 26 అర్థరాత్రి నుంచి 27వ తేదీ అర్థరాత్రి వరకు కార్యక్రమం కొనసాగుతుందని పార్క్ ఇనిస్టిట్యూషన్స్ సీఈఓ అనుష్క రవి విలేకరులకు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల సహకారంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటించనున్నట్లు చెప్పారు. కలాం పేరుతో కొన్ని గ్రామాల్లో లైబ్రరీలు, పాఠశాలల్లో సైన్స్ అండ్ రీసెర్చ్పై శిక్షణ ఇవ్వడానికి క్లబ్స్ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మీడియా సమావేశంలో పాల్గొన్న కలాం మనవడు ఏపీజేఎంజే షేక్ దావూద్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







