తమిళనాడులో కలాం వర్థంతి సందర్భంగా కోటి మొక్కలు

- July 21, 2016 , by Maagulf
తమిళనాడులో కలాం వర్థంతి సందర్భంగా కోటి మొక్కలు

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మొదటి వర్థంతి సందర్భంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. జులై 27న ఆయన వర్థంతి సందర్భంగా తమిళనాడులోని పార్క్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వీరు కోటి మొక్కలు నాటనున్నారు. జులై 26 అర్థరాత్రి నుంచి 27వ తేదీ అర్థరాత్రి వరకు కార్యక్రమం కొనసాగుతుందని పార్క్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సీఈఓ అనుష్క రవి విలేకరులకు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల సహకారంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటించనున్నట్లు చెప్పారు. కలాం పేరుతో కొన్ని గ్రామాల్లో లైబ్రరీలు, పాఠశాలల్లో సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌పై శిక్షణ ఇవ్వడానికి క్లబ్స్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మీడియా సమావేశంలో పాల్గొన్న కలాం మనవడు ఏపీజేఎంజే షేక్‌ దావూద్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com