జంటనగరాల్లో కుండపోత వర్షం

- July 21, 2016 , by Maagulf
జంటనగరాల్లో కుండపోత వర్షం

భాగ్యనగరంలో గంట నుంచి భారీగా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాల్లోతు నీరు నిలిచిపోయింది. దిల్‌సుఖ్ నగర్, ఫిల్మ్ నగర్, అమీర్‌పేట్, బాలానగర్, శ్రీనగర్ కాలనీ, కృష్ణానగర్, బోరబండ, సికింద్రాబాద్, వనస్థలీపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షం పడుతోంది. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వర్షపు భారీగా వచ్చి చేరడంతో నదీ ప్రవాహంలా తలపిస్తోంది. దీంతో నగరంలో నిత్య నరకప్రాయమైన ట్రాఫిక్ స్థంభించిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వర్షంలో తడుస్తూనే పోలీసు వర్గాలు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తూ తమ సేవలను కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇక పాదాచారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఆఫీసులకు వచ్చిన ఉద్యోగులు ఇంటికెళ్లలేక ఇబ్బందిపడుతున్నారు. పలు ప్రాంతాల్లో కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాల జనాలంతా తీవ్ర భయంతో వణికిపోతున్నారు. వరద నీరు ఇళ్ళల్లోకి ప్రవేసిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. భారీ వర్షానికి కొన్ని ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com