ట్రాన్స్జెండర్ల వేధింపులపై ట్వీట్: సీపీ సజ్జనార్
- October 09, 2025
హైదరాబాద్: హైదరాబాద్ లో ట్రాన్స్జెండర్ లు నుంచి ఎదురవుతున్న వేధింపులు, డబ్బుల వసూలు వంటి సమస్యలు ఇటీవల తీవ్రమైన రూపం దాల్చాయి.దీనిపై సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ఫిర్యాదులు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పోలీసులు, రాజకీయ నాయకుల అండతో ఈ వసూళ్ల పర్వం పరాకాష్ఠకు చేరిందంటూ ఒక నెటిజన్ X (ట్విట్టర్) వేదికగా నేరుగా పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు.
నెటిజన్ చేసిన ఫిర్యాదులో.. నగరంలో ట్రాన్స్జెండర్ల చర్యలు అదుపు తప్పాయని, వారు బహిరంగంగా రూపాయలు వేలు డిమాండ్ చేస్తూ.. ఇవ్వని వారిని మానసికంగా, శారీరకంగా కూడా వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ.. సీనియర్ ఐపీఎస్ అధికారి, కమిషనర్ సజ్జనార్ను ట్యాగ్ చేశారు.
ఈ ఫిర్యాదుకు సీపీ సజ్జనార్ స్పందించారు.ఈ సమస్యను నా దృష్టికి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు. దీనిని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాము అని ఆయన జవాబిచ్చారు. ఆరోపణలలోని నిజానిజాలను క్షుణ్ణంగా పరిశీలించి.. వాటిని ధృవీకరించిన తర్వాత చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- జులీబ్, షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్..!!
- గాజా కోసం అమెరికా శాంతి ప్రణాళిక..మొదటి దశపై బహ్రెయిన్ ప్రశంసలు..!!
- సముద్ర నావిగేషన్ను పునఃప్రారంభించిన ఖతార్..!!
- జాయెద్ ఇంటర్నేషనల్లో డిజిటల్ టూరిస్ట్ వాలెట్ ప్రారంభం..!!
- ప్రమాద బాధితుల వీడియో రికార్డ్..ఒమన్లో వ్యక్తి అరెస్టు..!!
- మక్కాలో మహిళలపై వేధింపులు..ఆఫ్ఘన్ జాతీయుడు అరెస్టు..!!
- అమెరికన్ ప్రతినిధుల బృందంతో సీఎం భేటీ..
- ఏపీ: త్వరలో భారీగా పోలీస్ నియామకాలు..
- ట్రాన్స్జెండర్ల వేధింపులపై ట్వీట్: సీపీ సజ్జనార్
- చంద్రబాబు పేదవాడికి భవిష్యత్ లేకుండా చేస్తున్నారు – జగన్