యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!

- October 12, 2025 , by Maagulf
యూరప్‌కు వెళుతున్నారా?  అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!

మస్కట్: అక్టోబర్ 12 నుండి ఒమన్ మరియు ఇతర యూరోపియనేతర దేశాల ప్రయాణికులకు సంబంధించి కొత్త ఎంట్రీ/ఎగ్జిట్ సిస్టమ్ నేటి నుంచి అమల్లోకి వచ్చింది.  29 EU దేశాలలో సాంప్రదాయ పాస్‌పోర్ట్ స్టాంపులను ఇకపై ఆటోమేటెడ్ బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్‌తో భర్తీ చేస్తారు.  

ప్రతి ప్రయాణికుడి ఫేస్, ఫింగర్ ఫ్రింగ్స్ సహా పాస్‌పోర్ట్ వివరాలు ఇప్పుడు స్కెంజెన్ ప్రాంతం నుండి ఎంట్రీ, ఎగ్జిట్ సమయంలో డిజిటల్‌గా నమోదు అవుతాయి. అయితే, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఫోటోగ్రాఫ్‌ను మాత్రమే అనుమతిస్తారు.

డిజిటల్ ఎంట్రీ/ఎగ్జిట్ సిస్టమ్ (EES) ఏదైనా 180 రోజుల వ్యవధిలో 90 రోజుల వరకు రెసిడెన్సీ ఉన్న అన్ని స్కెంజెన్ దేశాలకు ప్రయాణించే వారికి వర్తిస్తుంది. కాగా, EU పౌరులు, నివాసితులు మరియు దీర్ఘకాలిక వీసాలు లేదా నివాస అనుమతులు కలిగి ఉన్నవారికి మినహాయింపు ఇచ్చారు. 

EES దీర్ఘకాలికంగా సరిహద్దు విధానాలను వేగవంతం చేస్తుందని, ఓవర్‌స్టేలు, గుర్తింపు ఫ్రాడ్స్, అక్రమ వలసలను గుర్తించడంలో అధికారులకు సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com