బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- October 16, 2025
మనామా: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అక్టోబర్ 16–17 తేదీలలో ప్రవాస సంగమం కోసం బహ్రెయిన్లో పర్యటించనున్నారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆయన బహ్రెయిన్ లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా మలయాళం మిషన్ మరియు లోక కేరళ సభ సభ్యులు నిర్వహించే గ్రాండ్ ప్రవాసీ సంగమంలో పాల్గొంటారు. ఇది అక్టోబర్ 17న సాయంత్రం 6:30 గంటలకు బహ్రెయిన్ కేరళీయ సమాజం (BKS)లో జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయన్ ముఖ్య అతిథిగా పాల్గొని మలయాళీ ప్రవాస సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి భారత రాయబారి వినోద్ కె. జాకబ్, మంత్రి సాజి చెరియన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. జయతిలక్ మరియు పారిశ్రామికవేత్త ఎం.ఎ. యూసుఫ్ అలీ వంటి అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ మేరకు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ పి.వి. రాధాకృష్ణ పిళ్లై మరియు జనరల్ కన్వీనర్ పి. శ్రీజిత్ ప్రకటించారు.
తాజా వార్తలు
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ
- తెలంగాణ: నర్సింగ్ కాలేజీల పై కొరడా
- శ్రీశైలంలో భారీ భద్రత మధ్య ప్రధాని మోదీ పర్యటన