మెడికల్ విద్యార్థులకు శుభవార్త–ఏపీలో 250 కొత్త ఎంబీబీఎస్ సీట్లు
- October 17, 2025
2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో(AP) ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుండగా, తాజాగా పలు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సీట్లను పెంచుకునేందుకు జాతీయ వైద్య కమిషన్ (National Medical Commission – NMC) అనుమతులు మంజూరు చేసింది. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా దాదాపు 250 కొత్త ఎంబీబీఎస్ సీట్లు (AP)పెరిగాయి. ఈ పెరిగిన సీట్లను త్వరలో రాబోయే మూడో విడత కౌన్సెలింగ్లో భర్తీ చేయనున్నట్లు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది.
సీట్లు పెరిగిన కళాశాలలు:
ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సీట్ల పెంపు వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
- పుత్తూరు అన్నా గౌరి వైద్య కళాశాల: సీట్ల సంఖ్య 100 నుంచి 150కి పెరిగింది (50 సీట్ల పెంపు).
- కర్నూలు శాంతిరామ్ వైద్య కళాశాల: ఇప్పటికే 200కు పెరిగిన సీట్లను తాజాగా మరో 50 సీట్లు పెంచి 250కి అనుమతులు లభించాయి.
- విశాఖపట్నం ఎన్నారై మెడికల్ కాలేజీ: ఇక్కడ ఇప్పటికే ఉన్న 150 సీట్లను ఏకంగా 250కి పెంచుతూ అనుమతులు వచ్చాయి (100 సీట్ల పెంపు).
పెరిగిన ఈ సీట్లకు సంబంధించిన లెటర్ ఆఫ్ పర్మిషన్ (LOP) త్వరలో రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- మెడికల్ విద్యార్థులకు శుభవార్త–ఏపీలో 250 కొత్త ఎంబీబీఎస్ సీట్లు
- కొత్త ODI జెర్సీ విడుదల
- ‘శ్వాస స్వర సంధ్య' తో ఈలపాట మాంత్రికుడు పద్మశ్రీ డా.శివప్రసాద్ మాయాజాలం
- దుబాయ్ లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్..వాహనం సీజ్..!!
- ఇబ్రి గవర్నరేట్లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాపాయం..!!
- భవనాల సబ్ డివజన్ కి SR25వేల గరిష్ట జరిమానా..!!
- హైదరాబాద్ లో భారీగా గోల్డ్ బార్స్ స్వాధీనం..!!
- ప్రైవేట్ పాఠశాలలకు BD100,000 వరకు జరిమానాలు..!!
- ఖతార్ లో పుంజుకున్న రెసిడెన్షియల్ రెంటల్ మార్కెట్..!!
- తిరుమల లడ్డూ ధర పెంపు వార్తలు అవాస్తవం: బీఆర్ నాయుడు