మెడికల్ విద్యార్థులకు శుభవార్త–ఏపీలో 250 కొత్త ఎంబీబీఎస్ సీట్లు
- October 17, 2025
2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో(AP) ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుండగా, తాజాగా పలు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సీట్లను పెంచుకునేందుకు జాతీయ వైద్య కమిషన్ (National Medical Commission – NMC) అనుమతులు మంజూరు చేసింది. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా దాదాపు 250 కొత్త ఎంబీబీఎస్ సీట్లు (AP)పెరిగాయి. ఈ పెరిగిన సీట్లను త్వరలో రాబోయే మూడో విడత కౌన్సెలింగ్లో భర్తీ చేయనున్నట్లు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది.
సీట్లు పెరిగిన కళాశాలలు:
ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సీట్ల పెంపు వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
- పుత్తూరు అన్నా గౌరి వైద్య కళాశాల: సీట్ల సంఖ్య 100 నుంచి 150కి పెరిగింది (50 సీట్ల పెంపు).
- కర్నూలు శాంతిరామ్ వైద్య కళాశాల: ఇప్పటికే 200కు పెరిగిన సీట్లను తాజాగా మరో 50 సీట్లు పెంచి 250కి అనుమతులు లభించాయి.
- విశాఖపట్నం ఎన్నారై మెడికల్ కాలేజీ: ఇక్కడ ఇప్పటికే ఉన్న 150 సీట్లను ఏకంగా 250కి పెంచుతూ అనుమతులు వచ్చాయి (100 సీట్ల పెంపు).
పెరిగిన ఈ సీట్లకు సంబంధించిన లెటర్ ఆఫ్ పర్మిషన్ (LOP) త్వరలో రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









