మెడికల్ విద్యార్థులకు శుభవార్త–ఏపీలో 250 కొత్త ఎంబీబీఎస్ సీట్లు
- October 17, 2025
2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో(AP) ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుండగా, తాజాగా పలు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సీట్లను పెంచుకునేందుకు జాతీయ వైద్య కమిషన్ (National Medical Commission – NMC) అనుమతులు మంజూరు చేసింది. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా దాదాపు 250 కొత్త ఎంబీబీఎస్ సీట్లు (AP)పెరిగాయి. ఈ పెరిగిన సీట్లను త్వరలో రాబోయే మూడో విడత కౌన్సెలింగ్లో భర్తీ చేయనున్నట్లు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది.
సీట్లు పెరిగిన కళాశాలలు:
ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సీట్ల పెంపు వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
- పుత్తూరు అన్నా గౌరి వైద్య కళాశాల: సీట్ల సంఖ్య 100 నుంచి 150కి పెరిగింది (50 సీట్ల పెంపు).
- కర్నూలు శాంతిరామ్ వైద్య కళాశాల: ఇప్పటికే 200కు పెరిగిన సీట్లను తాజాగా మరో 50 సీట్లు పెంచి 250కి అనుమతులు లభించాయి.
- విశాఖపట్నం ఎన్నారై మెడికల్ కాలేజీ: ఇక్కడ ఇప్పటికే ఉన్న 150 సీట్లను ఏకంగా 250కి పెంచుతూ అనుమతులు వచ్చాయి (100 సీట్ల పెంపు).
పెరిగిన ఈ సీట్లకు సంబంధించిన లెటర్ ఆఫ్ పర్మిషన్ (LOP) త్వరలో రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









