మెడికల్ విద్యార్థులకు శుభవార్త–ఏపీలో 250 కొత్త ఎంబీబీఎస్ సీట్లు
- October 17, 2025
2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో(AP) ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుండగా, తాజాగా పలు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సీట్లను పెంచుకునేందుకు జాతీయ వైద్య కమిషన్ (National Medical Commission – NMC) అనుమతులు మంజూరు చేసింది. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా దాదాపు 250 కొత్త ఎంబీబీఎస్ సీట్లు (AP)పెరిగాయి. ఈ పెరిగిన సీట్లను త్వరలో రాబోయే మూడో విడత కౌన్సెలింగ్లో భర్తీ చేయనున్నట్లు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది.
సీట్లు పెరిగిన కళాశాలలు:
ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సీట్ల పెంపు వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
- పుత్తూరు అన్నా గౌరి వైద్య కళాశాల: సీట్ల సంఖ్య 100 నుంచి 150కి పెరిగింది (50 సీట్ల పెంపు).
- కర్నూలు శాంతిరామ్ వైద్య కళాశాల: ఇప్పటికే 200కు పెరిగిన సీట్లను తాజాగా మరో 50 సీట్లు పెంచి 250కి అనుమతులు లభించాయి.
- విశాఖపట్నం ఎన్నారై మెడికల్ కాలేజీ: ఇక్కడ ఇప్పటికే ఉన్న 150 సీట్లను ఏకంగా 250కి పెంచుతూ అనుమతులు వచ్చాయి (100 సీట్ల పెంపు).
పెరిగిన ఈ సీట్లకు సంబంధించిన లెటర్ ఆఫ్ పర్మిషన్ (LOP) త్వరలో రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!







