ఒమన్- తుర్కియే ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి..!!
- October 21, 2025
మస్కట్: ఒమన్ - తుర్కియే దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అయ్యాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవహారాలు, వాణిజ్యం మరియు సంస్కృతితో సహా పలు రంగాల్లో పురోగతి ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. నవంబర్లో సుల్తాన్ హైతం బిన్ తారిక్ తుర్కియే ను సందర్శించారు. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలు మరియు అవగాహన ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు.
తాజాగా టర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఒమన్ లో పర్యటిస్తున్నారు. ఇది ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ, సైనిక మరియు రక్షణ, సైన్స్ మరియు టెక్నాలజీ, విద్య, సంస్కృతి, పర్యాటక రంగాలలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని విస్తరించడానికి అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలు మరియు టర్కియే మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య పరిమాణం $1 బిలియన్లకు చేరుకుంటుందన్నారు. ఒమన్లో $6 బిలియన్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను టర్కిష్ కంపెనీలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులు ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోతుందన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్