కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- October 22, 2025
కువైట్: టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కువైట్ లో పర్యటిస్తున్నారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన స్వాగత కార్యక్రమానికి అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా మరియు క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖలీద్ అల్-హమద్ అల్-సబా హాజరయ్యారు. అమీర్ షేక్ మెషల్ బయాన్ ప్యాలెస్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఎర్డోగన్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా టర్కిష్లో తయారు చేయబడిన టోగ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని బహుమతిగా అందజేశారు.
అనంతరం అమీర్ ఎర్డోగన్తో బయాన్ ప్యాలెస్లో అధికారిక చర్చలు జరిపారు. ఇరుపక్షాలు కువైట్ మరియు టర్కీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించాయని, వివిధ రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలను చర్చించాయని అమీరి దివాన్ వ్యవహారాల మంత్రి షేక్ హమద్ జాబర్ అల్-అలీ అల్-సబా పేర్కొన్నారు.
ఈ సమావేశం రెండు దేశాల మధ్య బలమైన స్నేహ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందన్నారు. ఇంధనం, వాణిజ్యం మరియు రక్షణ పరిశ్రమ రంగాలలో టర్కీ - కువైట్ మధ్య ఉన్న సహకారం వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉందని ఎర్డోగన్ అన్నారని ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం ఎర్డోగన్ ప్రతినిధి బృందం కువైట్ నుండి ఖతార్కు బయలుదేరిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో ఘనంగా గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- 12 మిలియన్ దిర్హమ్ విలువైన విలాసవంతమైన ఊద్ దొంగతనం..12 గంటల్లో ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీస్
- కోర్టుల చుట్టూ తిరగలేకే మొయిజుద్దీన్ హత్య..ఏడుగురు అరెస్ట్
- జూన్ 1 నుంచి మారనున్న కీలక ఆర్థిక నిబంధనలు ఇవే!
- పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానం చేసిన సీపీ సుమతి
- అమెరికాలో తెలుగమ్మాయికి ప్రతిష్టాత్మక పురస్కారం
- తెలంగాణలో నిప్పుల కొలిమి: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
- ఒమన్ తీవ్రమైన వేడి.. 48°Cకు ఉష్ణోగ్రతలు..!!
- క్యజో రి శిఖరాన్ని అధిరోహించిన యువ బహ్రెయిన్ సాహసికుడు..!!
- అల్ జౌర్ బీచ్లో షార్క్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..!!









