కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- October 22, 2025
కువైట్: టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కువైట్ లో పర్యటిస్తున్నారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన స్వాగత కార్యక్రమానికి అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా మరియు క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖలీద్ అల్-హమద్ అల్-సబా హాజరయ్యారు. అమీర్ షేక్ మెషల్ బయాన్ ప్యాలెస్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఎర్డోగన్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా టర్కిష్లో తయారు చేయబడిన టోగ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని బహుమతిగా అందజేశారు.
అనంతరం అమీర్ ఎర్డోగన్తో బయాన్ ప్యాలెస్లో అధికారిక చర్చలు జరిపారు. ఇరుపక్షాలు కువైట్ మరియు టర్కీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించాయని, వివిధ రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలను చర్చించాయని అమీరి దివాన్ వ్యవహారాల మంత్రి షేక్ హమద్ జాబర్ అల్-అలీ అల్-సబా పేర్కొన్నారు.
ఈ సమావేశం రెండు దేశాల మధ్య బలమైన స్నేహ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందన్నారు. ఇంధనం, వాణిజ్యం మరియు రక్షణ పరిశ్రమ రంగాలలో టర్కీ - కువైట్ మధ్య ఉన్న సహకారం వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉందని ఎర్డోగన్ అన్నారని ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం ఎర్డోగన్ ప్రతినిధి బృందం కువైట్ నుండి ఖతార్కు బయలుదేరిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







