కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- October 22, 2025
కువైట్: టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కువైట్ లో పర్యటిస్తున్నారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన స్వాగత కార్యక్రమానికి అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా మరియు క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖలీద్ అల్-హమద్ అల్-సబా హాజరయ్యారు. అమీర్ షేక్ మెషల్ బయాన్ ప్యాలెస్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఎర్డోగన్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా టర్కిష్లో తయారు చేయబడిన టోగ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని బహుమతిగా అందజేశారు.
అనంతరం అమీర్ ఎర్డోగన్తో బయాన్ ప్యాలెస్లో అధికారిక చర్చలు జరిపారు. ఇరుపక్షాలు కువైట్ మరియు టర్కీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించాయని, వివిధ రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలను చర్చించాయని అమీరి దివాన్ వ్యవహారాల మంత్రి షేక్ హమద్ జాబర్ అల్-అలీ అల్-సబా పేర్కొన్నారు.
ఈ సమావేశం రెండు దేశాల మధ్య బలమైన స్నేహ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందన్నారు. ఇంధనం, వాణిజ్యం మరియు రక్షణ పరిశ్రమ రంగాలలో టర్కీ - కువైట్ మధ్య ఉన్న సహకారం వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉందని ఎర్డోగన్ అన్నారని ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం ఎర్డోగన్ ప్రతినిధి బృందం కువైట్ నుండి ఖతార్కు బయలుదేరిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







