కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- October 22, 2025
కువైట్: టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కువైట్ లో పర్యటిస్తున్నారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన స్వాగత కార్యక్రమానికి అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా మరియు క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖలీద్ అల్-హమద్ అల్-సబా హాజరయ్యారు. అమీర్ షేక్ మెషల్ బయాన్ ప్యాలెస్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఎర్డోగన్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా టర్కిష్లో తయారు చేయబడిన టోగ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని బహుమతిగా అందజేశారు.
అనంతరం అమీర్ ఎర్డోగన్తో బయాన్ ప్యాలెస్లో అధికారిక చర్చలు జరిపారు. ఇరుపక్షాలు కువైట్ మరియు టర్కీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించాయని, వివిధ రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలను చర్చించాయని అమీరి దివాన్ వ్యవహారాల మంత్రి షేక్ హమద్ జాబర్ అల్-అలీ అల్-సబా పేర్కొన్నారు.
ఈ సమావేశం రెండు దేశాల మధ్య బలమైన స్నేహ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందన్నారు. ఇంధనం, వాణిజ్యం మరియు రక్షణ పరిశ్రమ రంగాలలో టర్కీ - కువైట్ మధ్య ఉన్న సహకారం వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉందని ఎర్డోగన్ అన్నారని ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం ఎర్డోగన్ ప్రతినిధి బృందం కువైట్ నుండి ఖతార్కు బయలుదేరిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ









