మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- October 22, 2025
మస్కట్: ఒమన్ విమానాశ్రయాలు ప్రపంచ సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉన్న హువావేతో జతకట్టాయి. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తమ ఇంటెలిజెంట్ క్యాంపస్ షోకేస్ను ప్రారంభించాయి. ఇది ఒమన్ విమానయాన రంగంలో పురోగతిని సూచిస్తుందని వక్తలు తెలిపారు. భవిష్యత్ రవాణా అవసరాలకు అనుగుణంగా విమానాశ్రయాలను అభివృద్ధి చేయడానికి వ్యూహాత్మక నిబద్ధతను ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం స్మార్ట్ డిజిటల్ మౌలిక సదుపాయాలు, టెక్నాలజీలో ఒమన్ విమానాశ్రయాల పురోగతి చాటి చెబుతుందని పేర్కొన్నారు. విమానయాన ఆవిష్కరణలకు అభివృద్ధి చెందుతున్న ప్రాంతీయ కేంద్రంగా ఒమన్ను నిలుపుతుందని తెలిపారు.
మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని 40వేల మంది రోజువారీ ప్రయాణీకులకు వెయిటింగ్ ఏరియాలు మరియు చెక్-ఇన్ జోన్లతో సహా అన్ని సౌకర్యాలలో సురక్షితమైన హై-స్పీడ్ కనెక్టివిటీ ద్వారా ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. దీంతోపాటు అధునాతన నిఘా వ్యవస్థలు మరియు రియల్-టైమ్ డేటా అనలిటిక్స్ సామర్థ్యాల ద్వారా భద్రతా ప్రోటోకాల్లను బలోపేతం చేస్తుందని ఒమన్ విమానాశ్రయాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అహ్మద్ అల్ అమ్రీ తెలిపారు.
తాజా వార్తలు
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!







