నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- October 22, 2025
మహిళల ప్రీమియర్ లీగ్ ( WPL) విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. నాలుగో సీజన్కు సిద్ధమవుతోంది. డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ కన్నా ముందు మెగా వేలాన్ని (WPL auction 2026 ) నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. నవంబర్ 26 లేదా 27 తేదీల్లో ఢిల్లీ వేదికగా వేలాన్ని నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వేలం తేదీని బీసీసీఐ అఫీషియల్గా ప్రకటించనప్పటికి ఆయా తేదీల్లో జరిపేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఫ్రాంఛైజీలు ఎంత మంది ప్లేయర్లు అట్టిపెట్టుకోవాలి ? రైటు టు మ్యాచ్ ? వంటి వాటి గురించి ఇప్పటికే ఫ్రాంఛైజీలకు బీసీసీఐ సమాచారం ఇచ్చినట్లు క్రిక్ ఇన్ఫో తెలిపింది.
ఒక్కొ ఫ్రాంఛైజీ గరిష్టంగా ఐదుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో ముగ్గురు భారత ప్లేయర్లు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు అనుమతి ఉంది. ఫ్రాంఛైజీలు అట్టి పెట్టుకునే ప్లేయర్లలో.. తొలి ప్లేయర్కు రూ.3.5 కోట్లు, రెండో ప్లేయర్కు రూ.2.5 కోట్లు, మూడో ప్లేయర్కు రూ.1.75 కోట్లు, నాలుగో ప్లేయర్కు కోటీ, ఐదో ప్లేయర్కు రూ.50లక్షలు గా నిర్ణయించారు.
ఇక వేలంలో ఫ్రాంఛైజీ పర్స్ వాల్యూను రూ.15 కోట్లుగా నిర్ణయించారు. ఐదుగురిని రిటైన్ చేసుకుంటే పర్స్ వాల్యూ నుంచి 9.75 కోట్లు కట్ అవుతుంది. ఒక్కొ ఫ్రాంఛైజీ గరిష్టంగా 18 మందిని తీసుకోవచ్చు. మొత్తం ఐదు ఫ్రాంచైజీలు 90 మంది ప్లేయర్లు కలిగి ఉండనున్నాయి. ఇక ఫ్రాంఛైజీలు అన్ని తాము అట్టి పెట్టుకునే ప్లేయర్ల జాబితాను నవంబర్ 5లోపు బీసీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది.
బీసీసీఐ ఐదు రైట్ టు మ్యాచ్ (RTM) ఎంపికలను ఆమోదించింది. కానీ ఒక ఫ్రాంచైజీకి అందుబాటులో ఉన్న ఆర్టీఎమ్ల సంఖ్య అనేది నిలుపుకున్న ఆటగాళ్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. అట్టిపెట్టుకున్న ప్రతి ఆటగాడికి, ఫ్రాంచైజీ ఒక ఆర్టీఎమ్ ఎంపికను కోల్పోతుంది.
ఉదాహరణకు.. ఒక జట్టు ఐదుగురు ఆటగాళ్లను నిలుపుకుంటే వేలంలో ఆర్టీఎంను ఉపయోగించుకునే అవకాశం ఉండదు. మరోవైపు.. ఎటువంటి రిటెన్షన్లు లేకుండా వేలంలోకి వెళ్లే జట్టు ఐదు ఆర్టీఎమ్లను ఉపయోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..









