ఖతార్లో ఇండియన్ పాస్ పోర్ట్ కోసం న్యూ గైడ్ లైన్స్ జారీ..!!
- October 24, 2025
దోహా: దోహాలోని భారత రాయబార కార్యాలయం దేశంలోని ప్రవాసులకు అప్డేట్ చేసిన పాస్పోర్ట్ ఫోటో గైడ్ లైన్స్ కు సంబంధించి ఒక అలెర్ట్ జారీ చేసింది. గ్లోబల్ పాస్పోర్ట్ సేవా ప్రయోగంలో భాగంగా దరఖాస్తుదారులందరూ కొత్త పాస్పోర్ట్ను పునరుద్ధరణ లేదా దరఖాస్తు చేసే సమయంలో ICAO- కంప్లీంట్ ఫోటో గ్రాఫ్ ను అప్లోడ్ చేయాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
గైడ్ లైన్స్ ప్రకారం.. హెడ్ అండ్ షోల్డర్ పైభాగం క్లోజప్ ఉండాలి. అలాగే, ఫేస్ ఫోటోగ్రాఫ్లో 80-85% వరకు ఉండాలి. ఫోటో డైమెన్షన్స్ 630*810 పిక్సెల్లు కలిగి ఉండాలి. ఫోటోలను కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా మార్చకూడదు. ఫోటో బ్యాక్ గ్రౌండ్ తప్పనిసరిగా వైట్ మాత్రమే ఉండాలి. స్కిన్ టోన్లు నేచురల్ గా చూపించాలి. కెమెరా నుండి 1.5 మీటర్ల దూరం నుండి ఫోటోలు తీసినవై ఉండాలని గైడ్ లైన్స్ లో వివరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- గూగుల్కు రూ.30 లక్షల జరిమానా..హైకోర్టు కీలక తీర్పు
- యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!
- నార్త్ అల్ బతినాలో ఆర్థోడాంటిక్ క్లినిక్ సీజ్..!!
- 20వేల డాలర్ల నగదు, గోల్డ్ ఉన్న బ్యాగ్ ను పోగొట్టుకున్న ప్రయాణికురాలు..!!
- డొమెస్టిక్ వర్కర్ చెవి కొరికిన వ్యక్తికి జైలు శిక్ష..!!
- 73 మిలియన్లు దాటిన పేమెంట్స్ సిస్టమ్ లావాదేవీలు..!!
- జూన్ 1 నుండి మిడ్ డే డెలివరీలపై నిషేధం..!!
- ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రధాని మోదీ సూచనలు
- భారత నూతన సీడీఎస్గా జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతల స్వీకారం!
- రిటైర్డ్ పోలీసుల సేవలు ఆదర్శప్రాయం: సైబరాబాద్ సీపీ









