ఖతార్లో ఇండియన్ పాస్ పోర్ట్ కోసం న్యూ గైడ్ లైన్స్ జారీ..!!
- October 24, 2025
దోహా: దోహాలోని భారత రాయబార కార్యాలయం దేశంలోని ప్రవాసులకు అప్డేట్ చేసిన పాస్పోర్ట్ ఫోటో గైడ్ లైన్స్ కు సంబంధించి ఒక అలెర్ట్ జారీ చేసింది. గ్లోబల్ పాస్పోర్ట్ సేవా ప్రయోగంలో భాగంగా దరఖాస్తుదారులందరూ కొత్త పాస్పోర్ట్ను పునరుద్ధరణ లేదా దరఖాస్తు చేసే సమయంలో ICAO- కంప్లీంట్ ఫోటో గ్రాఫ్ ను అప్లోడ్ చేయాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
గైడ్ లైన్స్ ప్రకారం.. హెడ్ అండ్ షోల్డర్ పైభాగం క్లోజప్ ఉండాలి. అలాగే, ఫేస్ ఫోటోగ్రాఫ్లో 80-85% వరకు ఉండాలి. ఫోటో డైమెన్షన్స్ 630*810 పిక్సెల్లు కలిగి ఉండాలి. ఫోటోలను కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా మార్చకూడదు. ఫోటో బ్యాక్ గ్రౌండ్ తప్పనిసరిగా వైట్ మాత్రమే ఉండాలి. స్కిన్ టోన్లు నేచురల్ గా చూపించాలి. కెమెరా నుండి 1.5 మీటర్ల దూరం నుండి ఫోటోలు తీసినవై ఉండాలని గైడ్ లైన్స్ లో వివరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









