సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- October 26, 2025
హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేరును ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సప్లో ఆయన ఫొటోను ప్రొఫైల్గా ఉంచి, వివిధ నంబర్ల నుంచి ప్రజలకు సందేశాలు పంపుతున్నారు.ఈ విషయం ఆయన దృష్టికి రాగానే జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సజ్జనార్ స్పష్టంగా పేర్కొంటూ, “నా ఫొటోతో ఉన్న వాట్సప్ అకౌంట్లు నకిలీ. వాటి నుంచి వచ్చే సందేశాలు మోసపూరితమైనవి. ఎవరూ స్పందించవద్దు. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి, 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలి” అని తెలిపారు. అలాగే వ్యక్తిగత వివరాలు లేదా డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని హెచ్చరించారు.
సజ్జనార్ ఇటీవల ఎక్స్ (Twitter) లో ఒక నకిలీ కాల్ వీడియోను పోస్టు చేస్తూ, “మీ పిల్లలను కిడ్నాప్ చేశాం” అంటూ వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిల్లల పేర్లు చెప్పి ఏడుస్తున్న శబ్దాలు వినిపించినా ఆందోళన చెందకూడదని, వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని అన్నారు. అతను తెలిపినదేమిటంటే – “అత్యాశ మరియు భయం ఈ రెండే సైబర్ నేరగాళ్లకు పెద్ద ఆయుధాలు. అవగాహనతో, అప్రమత్తతతోనే ఈ మోసాలను అరికట్టవచ్చు” అని హెచ్చరించారు.
సమాజమాధ్యమాల్లో పిల్లలు లేదా కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లో పంచుకోవద్దని, బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు వెంటనే http://cybercrime.gov.in పోర్టల్ లేదా 1930 హెల్ప్లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







