హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- October 30, 2025
హైదరాబాద్: హైదరాబాద్ ఐటీ రంగంలో మరో గ్లోబల్ మైలురాయి నమోదైంది. ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్ఫుడ్ దిగ్గజం మెక్డొనాల్డ్స్ తన అత్యంత పెద్ద అంతర్జాతీయ కార్యాలయాన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అమెరికా వెలుపల మెక్డొనాల్డ్స్ ఏర్పాటు చేసిన అతిపెద్ద సెంటర్గా నిలిచింది. ఈ కేంద్రాన్ని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మెక్డొనాల్డ్స్ ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ, హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ గ్లోబల్ సెంటర్ ద్వారా కంపెనీకి కొత్త దిశ లభించనుందని తెలిపారు. ఈ కేంద్రం ప్రధానంగా ఇన్నోవేషన్, డిజిటల్ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజ్ ఆపరేషన్స్, డేటా అనలిటిక్స్, ఫైనాన్స్, టెక్నాలజీ సపోర్ట్ వంటి విభాగాల్లో కీలక పాత్ర పోషించనుంది. ఈ సెంటర్ ద్వారా 1200 మందికి పైగా హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి ఉపాధి లభించనుంది.
తాజా వార్తలు
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్
- బహ్రెయిన్లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో రియాద్, మదీనా..!!
- ఒమన్-రష్యా దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు..!!
- కువైట్ లో నవంబర్ 8న రెయిన్ ప్రార్థనలు..!!
- F1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025..లుసైల్ సర్క్యూట్ కు కౌంట్ డౌన్..!!
- సాలిక్ నవంబర్ 2న పీక్ అవర్ టోల్ రేట్స్ అప్డేట్..!!







