'మైసా' మొదలయ్యింది..
- November 03, 2025
            నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుసగా క్రేజీ సినిమాలు చేస్తోంది. త్వరలో ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విడుదల కానుంది. కన్నడ హీరో దీక్షిత్ శెట్టి హీరోగా చేస్తున్న ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టును మొదలుపెట్టింది రష్మిక. అదే మైసా. ఈ సినిమాలో గోండ్ గిరిజన మహిళగా కనిపించనుంది. దీనికి సంబందించిన పోస్టర్ కూడా ఇప్పటికే విడుదల చేశారు మేకర్స్.(Mysaa) మొహానికి రక్తంతో చేతిలో బల్లెం పట్టుకొని చాలా పవర్ ఫుల్ గా ఉన్న రష్మిక పోస్టర్ ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది.
ఇక తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు మేకర్స్. కేరళలోని అథిరప్పిల్లీలో ఈ షూటింగ్ మొదలయ్యింది. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రవీంద్ర పుల్లే ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవ్వనున్నాడు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ రెండు ఒకే టైంలో పూర్తి చేసి అతి త్వరగా సినిమాను విడుదల చేయాలనీ చూస్తున్నారు మేకర్స్. ఇటీవలి కాలంలో చాలా సినిమాలకు తన అద్భుతమైన మ్యూజిక్ తో ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇస్తున్న జాక్స్ బెజోయ్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక పుష్ప 2లో విలన్ గా నటించిన తారక్ ఈ సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 - బహ్రెయిన్ లో 52 నకిలీ సంస్థలు.. 138 వర్క్ పర్మిట్లు..!!
 - లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 







