యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
- November 04, 2025
            మనామా: సౌదీ పర్యాటక మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది యూనిఫైడ్ గల్ఫ్ వీసాను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇది గల్ఫ్ దేశాల మధ్య నాలుగు సంవత్సరాల సహకారం తర్వాత సాధించిన ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుందని పేర్కొన్నారు. సోమవారం బహ్రెయిన్లోని మనామాలో జరిగిన గల్ఫ్ గేట్వే ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్లో ఆయన ఈ విషయాలు తెలిపారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలు తమ పర్యాటక రంగాలలో చారిత్రాత్మక పరివర్తనను చూస్తున్నాయని, చమురు మరియు వాణిజ్యంతో పాటు పర్యాటకం కీలక ఆర్థిక స్తంభంగా అభివృద్ధి చెందుతుందని అల్-ఖతీబ్ అన్నారు.
ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం, అధునాతన మౌలిక సదుపాయాలు మరియు సురక్షితమైన వాతావరణం ఈ వృద్ధికి కారనాలుగా ఉన్నాయని, గల్ఫ్ను ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక గమ్యస్థానాలలో ఒకటిగా నిలిపాయని ఆయన వెల్లడించారు. గత సంవత్సరం ఈ ప్రాంతంలోని నాలుగు ప్రధాన విమానయాన సంస్థలు దాదాపు 150 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకెళ్లాయని అల్-ఖతీబ్ తెలిపారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 - బహ్రెయిన్ లో 52 నకిలీ సంస్థలు.. 138 వర్క్ పర్మిట్లు..!!
 - లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 







