కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- November 05, 2025
కువైట్: కువైట్ లో అత్యంత జనసాంద్రత కలిగిన జిల్లాల్లో ఒకటైన జ్లీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలోని 67 భవనాల కూల్చివేతకు కువైట్ మునిసిపాలిటీ నోటీసులు జారీ చేసింది. ఇందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. భవనాలు సురక్షితంగా లేవని మరియు ప్రజా భద్రతకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తున్నాయని టెక్నికల్ కమిటీ తనిఖీలు నిర్ధారించాయని నోటీసుల్లో పేర్కొన్నారు.
కాగా, ప్రభావిత భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని, ఈ కట్టడాలు అందులో ఉంటున్న వారి ప్రాణాలతోపాటు చుట్టుపక్కల ఉంటున్న వారికి ముప్పు కలిగిస్తాయని కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్, ఇంజినీర్ మనల్ అల్-అస్ఫోర్ వెల్లడించారు. ఇక నోటీసులను పట్టించుకోని సందర్భంలో, భవనాలను పూర్తిగా ఖాళీ యజమాని ఖర్చుతో మునిసిపాలిటీ కూల్చివేత పనులను చేపడుతుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







