మస్కట్ లో ఏపీ వాసి మృతి
- November 13, 2025
మస్కట్: ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వెదుళ్లువలస గ్రామానికి చెందిన సవలాపురపు నాగమణి(28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.తమ కుమార్తె నాగమణి గతంలో నాలుగేళ్లు అక్కడ పనిచేసి డబ్బులు పంపించేదని ఇటీవల ఇంటికి వచ్చి కొంతకాలం ఉండి మళ్లీ పని కోసం వెళ్లి నాలుగు నెలలు అయిందని మృతురాలు తల్లి సరోజిని బుధవారం తెలిపారు. ఒక ఏజెంట్ ద్వారా అక్కడికి పనికి వెళ్లారని చెప్పారు. నాగమణి మూడు రోజుల క్రితం ఫోన్ చేసి తనకు ఇక్కడ చాలా తీవ్ర ఇబ్బంది పెడుతూ, వేధిస్తున్నారు…స్వగ్రామం వచ్చేస్తానని చెప్పిందని, ఇబ్బందిగా ఉంటే వచ్చేమని తాము చెప్పామని వివరించారు. కానీ ఏం జరిగిందో తెలియదు అక్కడ ఏజెంట్ ఫోన్ చేసి మీ అమ్మాయి ఇక్కడ మస్కిట్లో ఆత్మహత్య చేసుకుందని చెప్పారని కన్నీరు మున్నీరయ్యారు.
ఆత్మహత్య చేసుకున్న ఫోటోలు పెట్టమని అడిగితే వాళ్ళు పెట్టట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తె నాగమణి మృతి చెందిన విషయాన్ని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లి అక్కడ నుంచి తమ కుమార్తె మృతదేహం వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారని తెలిపారని పేర్కొన్నారు.ఈ విషయంలో మాకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుచున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!







