డబ్బింగ్ సీరియళ్లతో తెలుగు ఆర్టిస్టులు రోడ్డున..
- July 24, 2016
డబ్బింగ్ సీరియళ్లతో తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్ల జీవితాలు రోడ్డున పడుతున్నాయని 'తెలుగు టెలివిజన్ యూనియన్' మరోసారి ఉద్యమానికి సిద్ధమైంది. ఫిలిం చాంబర్లో 'తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ యూనియన్' సభ్యులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 'డబ్బింగ్ సీరియళ్లతో ఇక్కడ ఉన్న ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉపాధి కోల్పోతున్నారు. వీటిని ఆపేయాలని ఒకసారి ఉద్యమం చేశాం.
మరోసారి ఉద్యమం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వాటిని అడ్డుకుంటామ'ని చెప్పారు. అనంతరం బుల్లితెర నటీనటుల డైరెక్టరీని దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా విడుదల చేశారు. నిర్మాత గురురాజ్, టీవీ ఫెడరేషన్ చైర్మన్ మేచినేని శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. తెలుగు టెలివిజన్ ఆర్టిస్టు సంఘం అధ్యక్షుడు వినోద్బాల, సెక్రటరీ విజయ్ యాదవ్, నటులు శివాజీ రాజా, రామ్జగన్, నాగమణి, సుబ్బారావు పలువురు టీవీ ఆర్టిస్టులు పాల్గొన్నారు
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









