హరితహారం లో పాల్గొన్న మజ్ను టీం
- July 25, 2016
వృక్షో రక్షితి రక్షితః ఈ మాట అక్షరాలా తెలంగాణలో అమలు అవుతుందే చెప్పాలి. గత పది హేను రోజులు తెలంగాణ లో హరిత హారం పేరిట వేల చెట్లు నాటారు..నాటుతున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థుల నుంచి తెలంగాణ సీఎం వరకు పాల్గొన్నారు. ఇక సినీ సెలబ్రెటీలు చిరంజీవి, నాగార్జున, అమల, నవతరం నటులు అంతా పాల్గొని ప్రజలను ఉత్సాహ పరుస్తున్నారు. పవిత్రమైన పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశం తో , తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం లో హీరో నాని మరియు "మజ్ను" చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం సేకరించిన వివిధ రకాల మొక్కలను చిత్ర బృందం ఈ రోజు నాటటం జరిగింది.
ఈ సందర్భం గా హీరో నాని మాట్లాడుతూ, " హరితహారం అనేది చాలా మంచి ఐడియా. పర్యావరణాన్ని కాపాడాలని అందరూ అంటారు కానీ ఎవ్వరు పెద్దగా ఏమీ చేయరు. అందుకు భిన్నం గా CM గారు అవేర్నెస్ పెంచే ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం నిజం గా చాలా మంచి విషయం. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఈ కార్యక్రమం లో ఉత్సాహం గా పాల్గొంటోంది.
ఎవరి ఇళ్లల్లో వాళ్ళు నాటటం కాకుండా, మా మజ్ను చిత్ర బృందం మొత్తం కలిసి ఈ కార్యక్రమం లో పాల్గొనాలని నిర్ణయించుకుని, ఇలా చేస్తున్నాం. ఎవరికి తోచిన విధం గా వారు, ఒక చిన్న చోటు ఉన్నా కూడా ఒక మొక్కను పెంచితే, ఖచ్చితం గా మంచి మార్పు ఉంటుంది అని అనుకుంటున్నాను", అని అన్నారు.

తాజా వార్తలు
- బహ్రెయిన్ ఎగ్జిబిషన్ సెంటర్లో 'ఈడబ్ల్యూబీ కలినేర్' సేవలు..!!
- కావేరి జలాల వివాదం.. సీఎం విజయ్ ముందున్న తొలి రాజకీయ సవాల్
- 2026 తొలి ఆరు నెలల్లో ఒమన్లో తగ్గిన జననాలు, మరణాలు..!!
- అట్టహాసంగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్!
- 75 రోజుల పాటు బురైదా అంతర్జాతీయ డేట్స్ ఫెస్టివల్..!!
- గాలిలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు..ఇద్దరు పైలట్లు మృతి
- మెట్రాష్ యాప్తో సీఐడీకి గోప్యంగా సమాచారం అందించే అవకాశం..!!
- భారత్ లో ఒక్కో యూజర్ నెలకు 50 గంటలు ఇన్స్టాలోనే!
- సెప్టెంబర్లో రోజుకు 1.88 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంపు..!!
- ప్రయాణాలకు వెళ్లే ముందు విద్యుత్ పరికరాలు ఆఫ్ చేస్తున్నారా..!!







