టీడీపీ నేత రేవంత్ రెడ్డి పోలీసులు అదుపులో
- July 25, 2016
టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లన్న సాగర్ నిర్వాసితులపై పోలీసులు లాఠీఛార్జీ జరపడంపై విపక్షాలు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.బంద్తో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. జిల్లాలోని పలు చోట్ల కాంగ్రెస్, వామపక్షాలు, టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. గజ్వేల్ వద్ద ఆందోళనకు దిగిన టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అరెస్టు చేసిన అనంతరం రేవంత్ రెడ్డిని పోలీసులు దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్కి తరలించారు. అలాగే , ఈ బంద్ కు మద్దత్తు తెలపడానికి వచ్చిన తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు
తాజా వార్తలు
- సలాలాలో ఒమన్-బహ్రెయిన్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఎగ్జిబిషన్ సెంటర్లో 'ఈడబ్ల్యూబీ కలినేర్' సేవలు..!!
- కావేరి జలాల వివాదం.. సీఎం విజయ్ ముందున్న తొలి రాజకీయ సవాల్
- 2026 తొలి ఆరు నెలల్లో ఒమన్లో తగ్గిన జననాలు, మరణాలు..!!
- అట్టహాసంగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్!
- 75 రోజుల పాటు బురైదా అంతర్జాతీయ డేట్స్ ఫెస్టివల్..!!
- గాలిలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు..ఇద్దరు పైలట్లు మృతి
- మెట్రాష్ యాప్తో సీఐడీకి గోప్యంగా సమాచారం అందించే అవకాశం..!!
- భారత్ లో ఒక్కో యూజర్ నెలకు 50 గంటలు ఇన్స్టాలోనే!
- సెప్టెంబర్లో రోజుకు 1.88 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంపు..!!







