ఇళ్లల్లో పని చేసే వారి కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా
- July 25, 2016
ఇళ్లల్లో పని చేసే వారి కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని కేంద్రం ప్రారంభించనుంది. తొలుత హైదరాబాద్, దిల్లీలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తారు. కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ పథకాన్ని ఆగస్టులో ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద యజమానులు నెలకు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. బీమా రక్షణలో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి కుటుంబసభ్యుల చికిత్సకు అయ్యే వ్యయంపై గరిష్ఠ పరిమితి ఉండదు. పనిమనుషులు, డ్రైవర్లు, సంరక్షకులు, వంటమనుషులు తదితరులకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా రక్షణ ఉంటుంది. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో, డిస్పెన్సరీల్లో వారికి చికిత్స లభిస్తుంది. బీమా లబ్ధిదారులకు నగదు ప్రయోజనాలేమీ ఉండవు. క్రమంగా ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తారు. జాతీయ పథకంగా విస్తరించిన తర్వాత దాదాపు 80లక్షల మందికి ఆరోగ్య బీమా రక్షణ లభిస్తుందని కార్మిక మంత్రిత్వశాఖలోని ఒక అధికారి వెల్లడించారు. యజమానుల చెల్లింపు స్వచ్ఛందమేనని ఆ అధికారి చెప్పారు. వంటగ్యాస్ రాయితీని సంపన్నులు స్వచ్ఛందంగా వదిలేసుకోవాలని విజ్ఞప్తి చేసిన తరహాలోనే ఈ పథకం కింద యజమానులు తమ ఇంటిలో పని చేసే వారి బీమా కోసం చెల్లించాలని తర్వాత ప్రధాని మోదీ, మంత్రి దత్తాత్రేయ విజ్ఞప్తి చేస్తారని ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









