సాదా బైనామాల రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- November 29, 2025
అమరావతి: సీఎం చంద్రబాబు సమక్షంలో నిన్న క్యాబినెట్ భేటీ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు అంశాలకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. అందులో సాదా బైనామాల రిజిస్ట్రేషన్ అంశం ఉంది. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు గడువును 2027 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఒప్పంద పత్రాల ద్వారా భూములు కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. అయితే, ఈ సౌకర్యం కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుంది.
భూమిని అమ్మే వ్యక్తి తప్పనిసరిగా చిన్న లేదా సన్నకారు రైతు అయి ఉండాలి. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా, అర్హులైన రైతులకు కొన్ని రాయితీలు కూడా లభిస్తాయి. బదిలీ సుంకం, రిజిస్ట్రేషన్ రుసుములు, స్టాంప్ డ్యూటీ వంటివి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మినహాయింపుల వల్ల చిన్న, సన్నకారు రైతులపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది. భూ రికార్డులను సరి చేసుకోవడం వారికి మరింత సులభం అవుతుంది. ఈ నిర్ణయం రైతుల సంక్షేమానికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
సాదా బైనామా అంటే అధికారికంగా రిజిస్టర్ కాని, తెల్ల కాగితాలపై చేసుకున్న భూముల కొనుగోలు ఒప్పందాలు. భూమిని కొన్న వారు, అమ్మిన వారు ఒక ఒప్పందంపై సంతకాలు చేస్తారు. అయితే దీన్ని అధికారికంగా ప్రభుత్వ కార్యాలయంలో నమోదు చేయరు.
చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు చేసినప్పుడు రిజిస్టర్డ్ డాక్యుమెంట్పై కాకుండా తెల్ల కాగితాలపై లావాదేవీల ఒప్పందం రాసుకుంటారు. దాని ఆధారంగానే భూముల క్రయ విక్రయాలు జరిగిపోతుంటాయి. కొన్ని దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని క్రయవిక్రయాలలో ఇలా జరుగుతోంది. ఇలా తెల్లకాగితాలపై ఒప్పందం రాసుకోవడాన్నే సాదా బైనామాగా పిలుస్తుంటారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









