బహ్రెయిన్ ఫెస్టివల్ను ప్రారంభించిన షేక్ మొహమ్మద్..!!
- December 05, 2025
మనామా: హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా రాస్ హయాన్లోని హెరిటేజ్ విలేజ్లో బహ్రెయిన్ ఫెస్టివల్ ఐదవ ఎడిషన్ను ప్రారంభించారు. ఏటా దీనిని సమాచార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. అంతకుముందు షేక్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కు సమాచార శాఖ మంత్రి డాక్టర్ రంజాన్ బిన్ అబ్దుల్లా అల్ నోయిమి స్వాగతం పలికారు.
ఈ ఫెస్టివల్ బహ్రెయిన్ అనేక రంగాలలో సాధించిన విజయాలను ప్రతిబింబిస్తుందని, అభివృద్ధిని ముందుకు నడిపించడంలో ప్రజల అంకితభావాన్ని హైలైట్ చేస్తుందని షేక్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అన్నారు. ఈ వేడుకలు హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా దార్శనికతకు అనుగుణంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ గుర్తింపును కాపాడుకోవడంలో మరియు బహ్రెయిన్ చరిత్ర, భవిష్యత్తు పురోగతి గురించి యువతరానికి అవగాహన కల్పించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు.
అనంతరం సాంస్కృతిక, వారసత్వ ప్రదర్శనలు, సాంప్రదాయ చేతిపనులు మరియు స్థానిక ఉత్పత్తులను ప్రదర్శించే మార్కెట్ ను సందర్శించారు. ఈ సంవత్సరం డిసెంబర్ 28 వరకు ఫెస్టివల్ జరుగుతుంది. ఇంటరాక్టివ్ సెషన్లు, వారసత్వ వర్క్షాప్లు మరియు కుండలు, సాంప్రదాయ ఓడ నమూనా నిర్మాణం, వస్త్ర పనిలో శిక్షణా సెషన్లను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







