డైమండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఖతార్..!!
- December 05, 2025
దోహా: ఖతార్ ప్రతిష్టాత్మకమైన డైమండ్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. కింబర్లీ లాబొరేటరీ ఫర్ డైమండ్ అండ్ జెమ్స్టోన్ టెస్టింగ్లో ప్రపంచంలోని ప్రముఖ అధికార సంస్థ అయిన జెమోలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా (GIA) సహకారంతో ఈ కోర్సును ప్రవేశపెట్టినట్లు ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ వెల్లండించింది. మంత్రిత్వశాఖ అనుమతి ఉన్న జెమ్స్టోన్స్ విజువల్ ఆర్ట్స్ సెంటర్ అందించే ఈ ప్రొఫెషనల్ వృత్తి విద్య కోర్సును పూర్తి చేయడం ద్వారా డైమండ్ టెస్టింగ్ లో నిపుణులుగా స్థిరపడవచ్చని తెలిపింది.
ఖతార్, GCCలో ఈ తరహా కోర్సు ప్రారంభించడం ఇదే మొదటి సారని విద్యా సేవల కేంద్రాల విభాగం డైరెక్టర్ ఎమాన్ అల్-నుయిమి తెలిపారు. ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్రొఫెషనల్స్ కు కేంద్రంగా ఖతార్ ను నిలుపుతుందని, అధిక నైపుణ్యం అవసరమయ్యే రంగాలలో ప్రత్యేక శిక్షణ కోరుకునే వారికి ఖతార్ గమ్యస్థానంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రసిద్ధ అమెరికన్, బెల్జియన్ మరియు స్విస్ సంస్థలతో సహకార ప్రోగ్రామ్పై విశ్వాసాన్ని పెంచుతుందని అన్నారు. ఇది ఇప్పటికే పెట్టుబడిదారుల ఆసక్తిని ఆకర్షించిందని అల్-నుయిమి తెలిపారు.
ఖతార్ ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇచ్చేలా, యువతలో వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రోత్సహించే అధిక-నాణ్యత గల ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ప్రోత్సహించడంలో మంత్రిత్వ శాఖ ముందు వరుసలో ఉంటుందని అల్-నుయిమి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







