నవీన రాజకీయం గతి తప్పి అభివృద్ధికి అవరోధంగా మారుతున్న వేళ
- July 19, 2015
ఇటీవల కాలం లో మనం చూస్తున్న ఈ క్రొంగొత్త రాజకీయం అనేకానేక మలుపులు తిరుగుతూ ఆఖరికి ఇరు రాష్ట్రాల ప్రజల ను సందిగ్దావస్థ లో నెట్టి వేసింది. వాస్తవాస్తావాలు పక్కన పెడితే ఒక ముఖ్య విషయం పైన చర్చించవలసిన అవసరం ప్రాజ్నులైన వారికి వుంది.
నిజానికి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకత్వ వ్యవస్థ అధికారం లోకి వచ్చిన తరువాత కూడా ప్రలోభాల ద్వారా పరోక్షం గా వ్యక్తులను తమ వర్గం లో చేర్చుకుంటూ,తాము నిర్మించుకున్న పునాదులను మరింత బలోపేతం చేసుకోవడం, తమను విమర్శించే వారే వుండకూడదు అని మితిమీరిన ఆత్మ విశ్వాసం తో ప్రవర్తించడం సమర్ధనీయమా?
మరోపక్క తమ సిద్దాంత ప్రయోజనం కోసం ప్రజల బాగోగులు వదిలి అందని అరటి పండు కోసం అలవి మాలిన పనిని ప్రోత్సహించడం అనుభవజ్ఞుడైన నాయకులకు ఎంతవరకు సబబు ?
అయినా ఏదో చేస్తారని, చీకట్లో వున్నమా జీవితాలు బాగా ఉద్దరిస్తారని విశ్వసించి రెండు తెలుగు రాష్ట్రాల లోనూ స్పష్ట మైన సంఖ్యా బలం తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ప్రజలు వోటు వేస్తె, ప్రస్తుతం దాన్ని అపహాస్యం చేస్తూ అనైతిక మైన కార్యక్రమాలు చేస్తున్న ప్రస్తుత నేతలు క్షమార్హులు కారు, కాలేరు.
ఇప్పటికైనా జరిగిన సంఘటనలను నిష్పక్షపాతం గా చట్టానికి అప్పచెప్పి తమ తప్పులను వొప్పుకుని తిరిగి ప్రజలకు పట్టెడన్నం పెడితే అదే సంతోషం.మన తెలుగు వారు చాల మంచి వారు, అదే సమయం లో సున్నిత మనస్కులు, అందుకే పశ్చాతాప్త హృదయం తో వారి ముందు నిలిస్తే క్షమించి అక్కున చేర్చుకుంటారు. కనుక ఇరు రాష్ట్రాల అధినేతలు ఇప్పటికైనా సంయమనం పాటించి నిబద్దత తో వ్యవహరించి తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేయాలని కోరుకుంటూ ....
మీ ప్రవాస భారతీయుడు ( ఒక తెలుగు వాడు)
సుబ్రహ్మణ్య శర్మ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







