దుబాయ్ లో పబ్లిక్ పార్క్ వేళలు పొడిగింపు..!!
- December 30, 2025
దుబాయ్: 2026 నూతన సంవత్సర వేడుకల కోసం దుబాయ్ సిద్ధమవుతోంది. నివాసితులు, పర్యాటకులను ఫైర్ వర్క్స్ మరియు డ్రోన్ ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ మునిసిపాలిటీ డిసెంబర్ 31 మరియు జనవరి 1న పబ్లిక్ పార్కులతోపాటు ఎంటర్ టైన్ మెంట్ సౌకర్యాల పని వేళలను పొడిగించింది.
అల్ సఫా మరియు జబీల్ పార్క్ ఉదయం 8 నుండి తెల్లవారుజామున 1 గంట వరకు ఉంటుంది. క్రీక్ పార్క్ మరియు ముష్రిఫ్ నేషనల్ పార్క్ ఉదయం 8 నుండి అర్ధరాత్రి వరకు సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. ఇక అల్ మమ్జర్ పార్క్ ఉదయం 6 నుండి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటుంది. చిల్డ్రన్స్ సిటీ ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు, రెసిడెన్సీ పార్కులు మరియు ప్లాజాలు ఉదయం 8 నుండి అర్ధరాత్రి వరకు అనుమతిస్తారు.
ఖురాన్ పార్క్ ఉదయం 8 నుండి అర్ధరాత్రి వరకు, గుహ మరియు గ్లాస్ హౌస్ ఉదయం 9 నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. దుబాయ్ ఫ్రేమ్ ఉదయం 8 నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. లేక్ పార్కులు డిసెంబర్ 31న ఉదయం 8 నుండి తెల్లవారుజామున 1 గంట వరకు ఉంటుంది.
వీటితోపాటు లీమ్ లేక్ పార్క్ - హట్టా, అల్ వాడి పార్క్ - హట్టా, ఘదీర్ అల్ తైర్ పాండ్ పార్క్, అల్ బర్షా పాండ్ పార్క్, అల్ త్వార్ పాండ్ పార్క్, అల్ నహ్దా పాండ్ పార్క్, అల్ ఖవానీజ్ పాండ్ పార్క్, అల్ వార్కా థర్డ్ పార్క్ 1, ఉమ్ సుఖీమ్ పార్క్, అల్ ఖజాన్ పార్క్, అల్ సత్వా పార్క్, అల్ ఖుజ్ పార్క్ 1 పనివేళలను పొడింగించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









