జబల్ షమ్స్లో జీరో కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు..!!
- January 10, 2026
మస్కట్: జబల్ షమ్స్లో దేశంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత -2.2°C గా అధికారికంగా నమోదైంది. ఈ మేరకు ఒమన్ వాతావరణ కార్యాలయం తన తాజా నివేదికలో తెలిపింది. ఇది ప్రస్తుత వింటర్ సీజన్ లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత అని తెలిపింది.
అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలు గడ్డకట్టే స్థాయికి చేరుకున్నాయని, దక్షిణ గవర్నరేట్లు మాత్రం ఇంకా వేడి వాతావరణం ఉందని వెల్లడించింది. ఎత్తైన ప్రాంతాలు మరియు లోపలి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయని, జబల్ షమ్స్ తర్వాత, సైక్లో 3.4°C కనిష్ట ఉష్వగ్రత నమోదైనట్లు పేర్కొంది. మఖ్షాన్ మరియు హైమాలో ఉష్ణోగ్రతలు 9°C నుండి 10°C మధ్య ఉన్నాయని తెలిపింది.
అల్ ధాహిరా మరియు అల్ బురైమి నివాసితులు తెల్లవారుజామున జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ బాగా తగ్గుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









