ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- January 18, 2026
మనామా: బహ్రెయిన్ లో దారి దోపిడీ సంఘటన నమోదైంది. ఒక టాక్సీ డ్రైవర్ను రోడ్డుపై ఆపిన ఒక వ్యక్తి.. బలవంతంగా వాహనంలోకి ప్రవేశించి, డ్రైవర్ ను రాయితో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అతని వద్ద ఉన్న సెల్ ఫోన్, BD220 నగదు తీసుకెళ్లిపోయాడు. బాధితుడి ఫిర్యాదులో కేసు నమోదైంది. ఈ కేసును హై క్రిమినల్ కోర్టు విచారణ చేపట్టింది.
నిందితుడు రాయితో కొట్టడంతో డ్రైవర్ తలకు బలమైన గాయం ఏర్పడిందని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. ఈ మేరకు దాడికి సంబంధించిన వీడియో క్లిప్ ను సమర్పించారు. ప్రాసిక్యూషన్ ఆ వ్యక్తిపై దొంగతనం అభియోగం మోపింది. కాగా, ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు..ఫిబ్రవరి 24న తుదితీర్పు ప్రకటిస్తామని వాయిదా వేసింది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







