నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- January 18, 2026
నిజ్వా: నిజ్వా విలాయత్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వేగంగా అనేక షాపులకు వ్యాపించాయి. ఎగసిపడుతున్న మంటలను చూసి ప్రజలు భయంతో పరుగులు పెట్టారు.
అగ్ని ప్రమాదం సమాచారం అందగానే అల్ దఖిలియా గవర్నరేట్కు చెందిన పౌర రక్షణ మరియు అంబులెన్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను కష్టపడి అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు.
కాగా, ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు, జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించి విచారణ కొనసాగుతుందని, త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







