సినీ నిర్మాత ను అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు
- July 28, 2016
సినీ నిర్మాత కేఎస్ రామారావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ పోర్టికో కూలిన ఘటనలో ఆయనను అరెస్టు చేయవద్దంటూ బంజారాహిల్స్ పోలీసులకు గురువారం ఆదేశాలు జారీచేసింది. ఇద్దరు కార్మికుల మరణానికి కారణమంటూ తమపై పోలీసులు నమోదు చేసిన కేసును రద్దుచేయాలని కోరుతూ ఎఫ్ఎన్సీసీ అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు కేఎస్ రామారావు, రాజశేఖర్రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన దాఖలు చేశారు. పిటిషనను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. వారి తరపు న్యాయవాది వాదిస్తూ.. పిటిషనర్లపై భారత శిక్షా స్మృతిలోని 304-ఎ, 337, 338 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారని, ఈ సెక్షన్లు వారికి వర్తించవన్నారు. ప్రభుత్వం తరపు న్యాయవాది వాదిస్తూ.. జీహెచఎంసీ చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా పిటిషనర్లు అక్రమనిర్మాణాన్ని ప్రోత్సహించడం వల్లనే ప్రమా దం జరిగిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు..పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు పిటిషనర్లకు వర్తించవని అభిప్రాయపడింది. సీఆర్పీసీ 41 కింద ఇచ్చిన నోటీసులపై విచారణకు హాజరై సహకరించాలని న్యాయస్థానం వారికి స్పష్టం చేసింది. వ్యాజ్యంలో అదనపు సెక్షన్లుచేర్చితే హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. ముగ్గురి అరెస్టు ఈ ఘటనతో సంబంధం మున్న కాంట్రాక్టర్ కొండల్రావు, బాల్రాజు, ఇంజనీర్ సుధాకర్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. పోర్టికో నిర్మాణానికి ఆమోద ముద్ర వేసిన మిగతా కార్యవర్గంపై కూడా కేసు నమోదు చేసే యోచనలో పోలీసులున్నట్టు తెలిసింది.
తాజా వార్తలు
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!







