ఎగబాకిన బంగారం, వెండి ధరలు
- July 29, 2016
బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు తీశాయి. శుక్రవారం ఇక్కడి బులియన్ మార్కెట్లో పది గ్రాముల మేలిమి బంగారం ధర 315 రూపాయలు పెరిగి 31,230 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర ఏకంగా 1,410 రూపా యలు ఎగబాకి 48,160 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఇన్వెస్టర్లు, స్టాకిస్టులు పసిడి కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. పారిశ్రామిక డిమాండ్ వృద్ధితో వెండి ధర ఒక్కసారిగా పెరిగింది. 2014 ఫిబ్రవరి 21 తర్వాత వెండి ధర మళ్లీ ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,341.40 డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న యుఎస్ ఫెడరల్ రిజర్వు సంకేతాల నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఏర్పడింది. ఆగస్టు డెలివరీకి సంబంధించిన యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ ధర 1.1 శాతం మేర పెరిగింది
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









