ఎగబాకిన బంగారం, వెండి ధరలు
- July 29, 2016
బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు తీశాయి. శుక్రవారం ఇక్కడి బులియన్ మార్కెట్లో పది గ్రాముల మేలిమి బంగారం ధర 315 రూపాయలు పెరిగి 31,230 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర ఏకంగా 1,410 రూపా యలు ఎగబాకి 48,160 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఇన్వెస్టర్లు, స్టాకిస్టులు పసిడి కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. పారిశ్రామిక డిమాండ్ వృద్ధితో వెండి ధర ఒక్కసారిగా పెరిగింది. 2014 ఫిబ్రవరి 21 తర్వాత వెండి ధర మళ్లీ ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,341.40 డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న యుఎస్ ఫెడరల్ రిజర్వు సంకేతాల నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఏర్పడింది. ఆగస్టు డెలివరీకి సంబంధించిన యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ ధర 1.1 శాతం మేర పెరిగింది
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







