ఎమిరేట్స్ గుర్తింపు పత్రాల వివరాల ఇవ్వని 280 మంది ఉద్యోగుల జూలై జీతాలు నిలుపుదల
- July 29, 2016
ఎమిరేట్స్ లో గుర్తింపు పత్రాల వివరాల ఇవ్వడం లో అలసత్వం కనబర్చిన 280 మంది ఉద్యోగులకు జూలై జీతాలు నిలుపుదల చేశారు. జాతీయ స్థాయిలో అన్ని ఆర్థిక లావాదేవీలు మరియు విధానాలకు సంబంధించి ఒక ముఖ్యమైన సూచనని ఆర్ధిక మంత్రిత్వశాఖ ఇటీవల ప్రకటించింది. ఇందుకు సంబంధించిన సర్క్యులర్ నం 03, 3 వ ఏప్రిల్, 2016 న జారీ చేయబడింది. ఫెడరల్ ఫైనాన్షియల్ సిస్టమ్, ఉద్యోగి ఎమిరేట్స్ గుర్తింపు పత్రాలకు చెందిన వివరాలని నమోదు చేయించాల్సిన విషయానికి సంబంధించిన వాజ్యం అమలు ప్రారంభమవుతుందని తెలిపింది. మరియు అసంపూర్ణంగా లేదా సరికాని జాతీయ ఐ డి వివరాలను ఇవ్వని ఉద్యోగులు జూలై జీతాలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. సంపూర్తిగా లేదా సరికాని జాతీయ గుర్తింపు వివరాలతో 3000 మంది ఉద్యోగులతో పోల్చితే 280 మంది ఉద్యోగులు మాత్రమే ఆ వివరాలు అందించలేదు.ఎమిరేట్ ఐ డి సంఖ్య అన్ని ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ లావాదేవీలని వేగవంతం చేయడానికి ఇది ఒక ముఖ్యమైన ప్రక్రియ అని ప్రకటించింది..ఆర్ధిక వనరులని మేనేజ్మెంట్ సహాయ కార్యదర్శి మరియం మహమ్మద్ అల్ అమిరి మాట్లాడుతూ వ్యవస్థలో అవసరమైన సమాచారం నమోదు పూర్తయినదని, ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం అసంపూర్తిగా ఉందని అందుకే అందరికి సరైన డేటా ఉండేందుకు ఈ సమాచారం నమోదు కావాల్సి ఉంటుందన్నారు. దీని ద్వారా అన్ని లావాదేవీలు దేశంలో సులభతరం అవుతాయని అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







