ఎమిరేట్స్ గుర్తింపు పత్రాల వివరాల ఇవ్వని 280 మంది ఉద్యోగుల జూలై జీతాలు నిలుపుదల
- July 29, 2016
ఎమిరేట్స్ లో గుర్తింపు పత్రాల వివరాల ఇవ్వడం లో అలసత్వం కనబర్చిన 280 మంది ఉద్యోగులకు జూలై జీతాలు నిలుపుదల చేశారు. జాతీయ స్థాయిలో అన్ని ఆర్థిక లావాదేవీలు మరియు విధానాలకు సంబంధించి ఒక ముఖ్యమైన సూచనని ఆర్ధిక మంత్రిత్వశాఖ ఇటీవల ప్రకటించింది. ఇందుకు సంబంధించిన సర్క్యులర్ నం 03, 3 వ ఏప్రిల్, 2016 న జారీ చేయబడింది. ఫెడరల్ ఫైనాన్షియల్ సిస్టమ్, ఉద్యోగి ఎమిరేట్స్ గుర్తింపు పత్రాలకు చెందిన వివరాలని నమోదు చేయించాల్సిన విషయానికి సంబంధించిన వాజ్యం అమలు ప్రారంభమవుతుందని తెలిపింది. మరియు అసంపూర్ణంగా లేదా సరికాని జాతీయ ఐ డి వివరాలను ఇవ్వని ఉద్యోగులు జూలై జీతాలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. సంపూర్తిగా లేదా సరికాని జాతీయ గుర్తింపు వివరాలతో 3000 మంది ఉద్యోగులతో పోల్చితే 280 మంది ఉద్యోగులు మాత్రమే ఆ వివరాలు అందించలేదు.ఎమిరేట్ ఐ డి సంఖ్య అన్ని ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ లావాదేవీలని వేగవంతం చేయడానికి ఇది ఒక ముఖ్యమైన ప్రక్రియ అని ప్రకటించింది..ఆర్ధిక వనరులని మేనేజ్మెంట్ సహాయ కార్యదర్శి మరియం మహమ్మద్ అల్ అమిరి మాట్లాడుతూ వ్యవస్థలో అవసరమైన సమాచారం నమోదు పూర్తయినదని, ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం అసంపూర్తిగా ఉందని అందుకే అందరికి సరైన డేటా ఉండేందుకు ఈ సమాచారం నమోదు కావాల్సి ఉంటుందన్నారు. దీని ద్వారా అన్ని లావాదేవీలు దేశంలో సులభతరం అవుతాయని అన్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







