దేశ రాజధాని దిల్లీలో 'రియో పరుగు'కు ఏర్పాట్లు చురుగ్గా
- July 29, 2016
మరికొన్ని రోజుల్లో రియో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో 'రియో పరుగు'కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం జెండా వూపి రియో పరుగు ప్రారంభిస్తారు. రియోకు వెళ్లే క్రీడాకారులకు శుభాకాంక్షలు చెప్పేందుకు, చిన్నారులు, యువత, ప్రజల్లో ఒలింపిక్స్ గురించి అవగాహన కల్పించడమే రియో పరుగు ముఖ్య లక్ష్యం అని మంత్రి గోయల్ అన్నారు.
రియో పరుగులో దాదాపు 20,000 విద్యార్థులు పాల్గొంటారు. మేజర్ ధ్యాన్చంద్ జాతీయ మైదానం నుంచి పరుగు ప్రారంభమై జవహర్లాల్ నెహ్రూ మైదానం వద్ద ముగుస్తుంది. అలాగే దేశంలోని క్రీడాప్రాధికార కేంద్రాలున్న (శాయ్ సెంటర్స్) సోనేపత్, కోల్కతా, భోపాల్, గాంధీనగర్, తిరువనంతపురంలో పరుగు కార్యక్రమాలు ఉంటాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శాయ్ రూపొందించిన 'ఇండియన్ ఒలింపిక్ జర్నీ' పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







