విమానాశ్రయంలోనే ప్రత్యేక ఔట్పోస్ట్ ఏర్పాటు
- July 29, 2016
విదేశాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరణించిన వారి మృతదేహాలను విమానాల్లో హైదరాబాద్కు తరలించడం ఇటీవల బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ విమానాశ్రయంలోని ఎయిర్ కార్గో విభాగానికి ప్రతి రోజూ రెండు మూడు మృతదేహాలు వస్తున్నాయి. వీటిని అప్పగిం చడానికి ఎయిర్ కార్గో అధికారులు శంషాబాద్ పోలీసుల నుంచి ఎన్వోసీ తీసుకురావడం తప్పనిసరి చేశారు.పోలీసుస్టేషన్ విమానాశ్రయానికి 9 కి.మీ. దూరంలో ఉండటంతో మృతదేహాలు తీసుకువెళ్లడానికి వస్తున్న వారు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న శంషాబాద్ జోన్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ విమానాశ్రయంలోనే ప్రత్యేక ఔట్పోస్ట్ ఏర్పాటు చేశారు. నిబంధనలను అనుసరించి ఎన్వోసీలు జారీ చేయనున్నట్లు శుక్రవారం ఆయన ప్రకటించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!







