విమానాశ్రయంలోనే ప్రత్యేక ఔట్పోస్ట్ ఏర్పాటు
- July 29, 2016
విదేశాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరణించిన వారి మృతదేహాలను విమానాల్లో హైదరాబాద్కు తరలించడం ఇటీవల బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ విమానాశ్రయంలోని ఎయిర్ కార్గో విభాగానికి ప్రతి రోజూ రెండు మూడు మృతదేహాలు వస్తున్నాయి. వీటిని అప్పగిం చడానికి ఎయిర్ కార్గో అధికారులు శంషాబాద్ పోలీసుల నుంచి ఎన్వోసీ తీసుకురావడం తప్పనిసరి చేశారు.పోలీసుస్టేషన్ విమానాశ్రయానికి 9 కి.మీ. దూరంలో ఉండటంతో మృతదేహాలు తీసుకువెళ్లడానికి వస్తున్న వారు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న శంషాబాద్ జోన్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ విమానాశ్రయంలోనే ప్రత్యేక ఔట్పోస్ట్ ఏర్పాటు చేశారు. నిబంధనలను అనుసరించి ఎన్వోసీలు జారీ చేయనున్నట్లు శుక్రవారం ఆయన ప్రకటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







