విమానాశ్రయంలోనే ప్రత్యేక ఔట్పోస్ట్ ఏర్పాటు
- July 29, 2016
విదేశాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరణించిన వారి మృతదేహాలను విమానాల్లో హైదరాబాద్కు తరలించడం ఇటీవల బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ విమానాశ్రయంలోని ఎయిర్ కార్గో విభాగానికి ప్రతి రోజూ రెండు మూడు మృతదేహాలు వస్తున్నాయి. వీటిని అప్పగిం చడానికి ఎయిర్ కార్గో అధికారులు శంషాబాద్ పోలీసుల నుంచి ఎన్వోసీ తీసుకురావడం తప్పనిసరి చేశారు.పోలీసుస్టేషన్ విమానాశ్రయానికి 9 కి.మీ. దూరంలో ఉండటంతో మృతదేహాలు తీసుకువెళ్లడానికి వస్తున్న వారు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న శంషాబాద్ జోన్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ విమానాశ్రయంలోనే ప్రత్యేక ఔట్పోస్ట్ ఏర్పాటు చేశారు. నిబంధనలను అనుసరించి ఎన్వోసీలు జారీ చేయనున్నట్లు శుక్రవారం ఆయన ప్రకటించారు.
తాజా వార్తలు
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- కువైట్-భారత్ అనుసంధానం..జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి..!!
- ఫేక్ కరెన్సీ.. బహ్రెయిన్ వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష..!!
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే









