మస్కట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు
- July 30, 2016గత కొన్ని రోజులుగా తక్కువ ఉష్ణోగ్రతలు మస్కట్లో నమోదు కాగా, ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇక నుంచి ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్కి పైగానే ఉంటాయని, తీర ప్రాంతాలతో పోల్చితే మిగతా ప్రాంతాల్లో ఈ ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం మస్కట్లో 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. వచ్చే వారం 29 నుంచి 34 డిగ్రీల వరకు ఉండనుంది. ఈ ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆదివారం నాటికి ఉష్ణోగ్రతల్లో 3 నుంచి 5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం కూడా ఉంది. వాతావరణం ఇప్పటివరకూ బాగానే ఉన్నా ముందు ముందు పెరిగే అవకాశముందన్న హెచ్చరికలతో అప్రమత్తమవుతున్నట్లు మస్కట్ వాసులు అంటున్నారు.
తాజా వార్తలు
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!







