ఇండియన్ ఎంబసీకి 2,419 ఫిర్యాదులు
- July 30, 2016
నెలవారీ ఓపెన్ హౌస్ సందర్భంగా ఇండియన్ ఎంబసీ, 2,419 ఫిర్యాదుల్ని స్వీకరించినట్లు వెల్లడించింది. అంబాసిడర్ సంజీవ్ అరోరా, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ఆర్కె సింగ్, ఇతర అధికారులు, ఫిర్యాదుదారులతో సమావేశమయ్యారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కతార్ గవర్నమెంట్తో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అధికారులు తెలిపారు. ఇండియన్ కమ్యూనిటీ బెనెవోలెంట్ ఫోరమ్ (ఐసిబిఎఫ్) అధ్యక్షుడు అరవింద్ పాటిల్ ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంబసీ ప్రతినిథుల బృందం సెంట్రల్ ప్రిజన్ని, మరియు డిపోర్టేషన్ సెంటర్ని ఈ వారం సందర్శించింది. అక్కడి పరిస్థితుల్ని తెలుసుకుంది. 2015లో లేబర్ అండ్ కమ్యూనిటీ వెల్ఫేర్ సెక్షన్ 4,132 ఫిర్యాదుల్ని తీసుకోగా, ఈ ఏడాది ఇప్పటిదాకా 2,419 ఫిర్యాదులను అందుకుంది. ఎంబసీలో నమోదైన మరణాల సంఖ్య 161. 2015లో ఈ సంఖ్య 279గా ఉంది.
తాజా వార్తలు
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!







