మస్కట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు
- July 30, 2016గత కొన్ని రోజులుగా తక్కువ ఉష్ణోగ్రతలు మస్కట్లో నమోదు కాగా, ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇక నుంచి ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్కి పైగానే ఉంటాయని, తీర ప్రాంతాలతో పోల్చితే మిగతా ప్రాంతాల్లో ఈ ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం మస్కట్లో 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. వచ్చే వారం 29 నుంచి 34 డిగ్రీల వరకు ఉండనుంది. ఈ ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆదివారం నాటికి ఉష్ణోగ్రతల్లో 3 నుంచి 5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం కూడా ఉంది. వాతావరణం ఇప్పటివరకూ బాగానే ఉన్నా ముందు ముందు పెరిగే అవకాశముందన్న హెచ్చరికలతో అప్రమత్తమవుతున్నట్లు మస్కట్ వాసులు అంటున్నారు.
తాజా వార్తలు
- కేరళంలో షిగెల్లా వ్యాధి..
- నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రి కీలక ప్రకటన
- ఈద్ డ్రా..విజేతల నంబర్లను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- హవల్లీ, ఫర్వానియాల్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ విస్తృత తనిఖీలు..!!
- ప్రాంతీయ భద్రత పై బహ్రెయిన్-ఈజిప్ట్ చర్చలు..!!
- దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- iPhoneలను వెంటనే అప్డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!
- మిడిలీస్టులోనే అతిపెద్ద వాటర్ పార్క్ కిద్దియాలో సాఫ్ట్ లాంచ్..!!
- విమాన ఛార్జీలపై పరిమితులను ఉపసంహరించుకున్న భారత్..!!
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!









