మస్కట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు
- July 30, 2016గత కొన్ని రోజులుగా తక్కువ ఉష్ణోగ్రతలు మస్కట్లో నమోదు కాగా, ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇక నుంచి ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్కి పైగానే ఉంటాయని, తీర ప్రాంతాలతో పోల్చితే మిగతా ప్రాంతాల్లో ఈ ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం మస్కట్లో 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. వచ్చే వారం 29 నుంచి 34 డిగ్రీల వరకు ఉండనుంది. ఈ ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆదివారం నాటికి ఉష్ణోగ్రతల్లో 3 నుంచి 5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం కూడా ఉంది. వాతావరణం ఇప్పటివరకూ బాగానే ఉన్నా ముందు ముందు పెరిగే అవకాశముందన్న హెచ్చరికలతో అప్రమత్తమవుతున్నట్లు మస్కట్ వాసులు అంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







