బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!
- February 15, 2026
మనామా: బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలో ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ బహ్రెయిన్ 2026 ముగింపు వేడుక జనరల్ స్పోర్ట్స్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ సల్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా సమక్షంలో జరిగింది. ఈ ఛాంపియన్షిప్ను బహ్రెయిన్ బ్యాడ్మింటన్ మరియు స్క్వాష్ ఫెడరేషన్ సహకారంతో బహ్రెయిన్ పారాలింపిక్ కమిటీ నిర్వహించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ ఈవెంట్ను ఆతిథ్యం ఇచ్చిన మిడిలీస్టులో మొదటి దేశంగా బహ్రెయిన్ నిలిచి చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. ముగింపు కార్యక్రమంలో జనరల్ స్పోర్ట్స్ అథారిటీ CEO డాక్టర్ అబ్దుల్రెహ్మాన్ సాదిక్ అస్కర్, బహ్రెయిన్ పారాలింపిక్ కమిటీ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ దువైజ్ అల్ ఖలీఫా, బహ్రెయిన్ పారాలింపిక్ కమిటీ సెక్రటరీ జనరల్ అలీ బిన్ మొహమ్మద్ అల్ మజీద్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- టాప్ 100 లో కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్..!!
- ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!
- ఇన్స్టంట్ లోన్స్: మీ స్మార్ట్ఫోన్ నుంచే తక్షణ రుణం
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!









