సురబయ గ్రాండ్ మస్జీదుకు పోటెత్తిన ప్రజలు..!!
- February 23, 2026
సురబయః సౌదీ అరేబియాలోని రెండు పవిత్ర మస్జీదుల ఇఫ్తార్ కార్యక్రమం కింద ఇండోనేషియాలోని సురబయలోని గ్రాండ్ మస్జీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కు 21,500 మంది హాజరయ్యారు. ఇది అతిపెద్ద రమదాన్ సమావేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇండోనేషియాలోని సౌదీ రాయబార కార్యాలయంలో ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇఫ్తార్ తోపాటు రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడి బహుమతిని కలిపి పంపిణీ చేశారు. తూర్పు జావా గవర్నర్ ఖోఫిఫా ఇందార్ పరవాన్సా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై.. ఇస్లాం మరియు ముస్లింలకు సేవ చేయడంలో సౌదీ అరేబియా చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమం ఇస్లామిక్ మరియు మానవతావాద పనులకు.. ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి సౌదీ అరేబియా చేస్తున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందని సౌదీ మత అనుబంధ అహ్మద్ అల్-హజ్మీ అన్నారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!







