నగరమంతటా బోనాల సందడి
- July 31, 2016
నగరమంతటా బోనాల సందడి నెలకొంది. ఆషాడం మూడో ఆదివారం కావడంతో దాదాపు అన్ని ప్రాంతాల్లో బోనాల సందడే కనిపిస్తోంది. పలు దేవాలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. కొందరు భక్తులు అమ్మవారికి కల్లు, బెల్లం పానకాన్ని సమర్పించి ముక్కులు తీర్చుకుంటున్నారు. మల్కాజ్గిరి, నేరెడ్మెట్, రసూల్పురా, పంజాగుట్లు, మెహీదీపట్నంలోని పలు ఆలయాల్లో బోనాలు ఉత్సావాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పాలబస్తీలోని లాల్దర్వాజలో సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకొని ముక్కులు తీర్చుకుంటున్నారు. ప్రత్యేకంగా అలంకరించిన బోనంలో పెరుగన్నం, దాంతో పాటుగా బెల్లంతో చేసిన అన్నాన్ని ఉంచి అమ్మవారికి సమర్పిస్తారు.చలువ చేయాలంటూ అమ్మవారికి బోనం సమర్పించి భక్తులు ముక్కులు చెల్లించుకుంటారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







