నగరమంతటా బోనాల సందడి
- July 31, 2016
నగరమంతటా బోనాల సందడి నెలకొంది. ఆషాడం మూడో ఆదివారం కావడంతో దాదాపు అన్ని ప్రాంతాల్లో బోనాల సందడే కనిపిస్తోంది. పలు దేవాలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. కొందరు భక్తులు అమ్మవారికి కల్లు, బెల్లం పానకాన్ని సమర్పించి ముక్కులు తీర్చుకుంటున్నారు. మల్కాజ్గిరి, నేరెడ్మెట్, రసూల్పురా, పంజాగుట్లు, మెహీదీపట్నంలోని పలు ఆలయాల్లో బోనాలు ఉత్సావాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పాలబస్తీలోని లాల్దర్వాజలో సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకొని ముక్కులు తీర్చుకుంటున్నారు. ప్రత్యేకంగా అలంకరించిన బోనంలో పెరుగన్నం, దాంతో పాటుగా బెల్లంతో చేసిన అన్నాన్ని ఉంచి అమ్మవారికి సమర్పిస్తారు.చలువ చేయాలంటూ అమ్మవారికి బోనం సమర్పించి భక్తులు ముక్కులు చెల్లించుకుంటారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









