జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం పై డ్రోన్‌ దాడి..ఒకరు మృతి..!!

- March 01, 2026 , by Maagulf
జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం పై డ్రోన్‌ దాడి..ఒకరు మృతి..!!

అబుదాబి: జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్‌ దాడికి పాల్పడింది. అయితే, ముందే భద్రతా దళాలు అప్రమత్తమై దానిని అడ్డుకున్నారు. అయితే, డ్రోన్ శిథిలాలు పడిపోవడంతో ఒక ఆసియా జాతీయుడు మరణించగా, ఏడుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పుకార్లు లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని అబుదాబి ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రజలను కోరింది.  ఏదైనా సమాచారాన్ని తామే అధికారికంగా ప్రకటిస్తామని, లేదా అధికారిక సోర్స్ ద్వారా మాత్రమే పొందాలని సూచించింది. 

   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com