నిరుద్యోగ యువతకు అలర్ట్..
- March 24, 2026
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. మార్చి 28న ఉస్మానియా యూనివర్సిటీలో భారీ జాబ్ మేళా నిర్వహించబోతున్నట్లు ఓయూ ఎంప్లాయిమెంట్ బ్యూరో ప్రకటించింది. ‘భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఫాబ్ సిటీ, రంగారెడ్డి)’ సహకారంతో ఈ నెల 28న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఈ జాబ్ మేళా నిర్వహించబోతున్నట్లు ఓయూ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 28, 2026 శనివారం ఉదయం 11:00 గంటలకు ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయం, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా, ఓయూలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు.
మార్చి 28న నిర్వహించే జాబ్ మేళా ద్వారా ఒకేసారి 100 అప్రెంటిస్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. బీటెక్ (EEE, ECE), డిప్లొమా (EEE, ECE) ఉత్తీర్ణులైన యువతీ యువకులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. 18-35 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 28 శనివారం ఉదయం 11 గంటల వరకు ఓయూ క్యాంపస్కు రావాల్సి ఉంటుంది. అభ్యర్థులు వచ్చేటప్పుడు.. వారి వెంట విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాల్సిందిగా సూచించారు. మార్చి 28న ఉదయం అభ్యర్థులు నేరుగా ఓయూలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో (UEI&GB/MCC) కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. మరింత సమాచారం కోసం హెచ్.ఆర్ (HR) స్పందన రెడ్డిని 9100877349 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.
తాజా వార్తలు
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు..అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు..నివాసితులకు అలెర్ట్ జారీ..!!
- నిరుద్యోగ యువతకు అలర్ట్..









