ఇరాన్తో శాంతి చర్చలకు వెళ్లము: ఇజ్రాయిల్ రాయబారి డానీ డానన్
- March 25, 2026
ఇరాన్తో యుద్ధం ఆపి శాంతి చర్చలకు అమెరికా ఇజ్రాయిల్ ప్రయత్నిస్తున్నాయి అనే వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్ రాయబారి డానీ డనోస్ ఖండించారు. మంగళవారం ఐక్యరాజ్యసమితిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందకుండా చూడడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ‘ఇరాన్తో శాంతి చర్చల గురించి నాకు తెలియదు. మేము ఆపరేషన్ను కొనసాగిస్తున్నామని గమనించడం ముఖ్యం. మేము మాట్లాడుకుంటున్న ఈ క్షణంలో.. ఇజ్రాయిల్, అమెరికా.. ఇరాన్లోని సైనిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగిస్తున్నాయి. మేము దాడుల్ని కొనసాగిస్తాము. సంప్రదింపుల గురించి మాట్లాడినప్పుడు ఏదైనా ఆపరేషన్ గానీ ఘర్షణకు సంబంధించి ముగించడానికి దౌత్య మార్గాన్ని అనుసరించడమేనని మాకు తెలుసు. ఇరాన్కు అణ్వాయుధ సామర్థ్యం, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం లేకుండా చేస్తాం. అలాగే కేవలం నెల రోజుల క్రితం అనుకుని ముందుకు తెచ్చిన లక్ష్యాలను సాధిస్తామని కూడా మేము హామీ ఇస్తున్నాము. ఈ ఘర్షణల్లో మేము అనుకున్న చాలా లక్ష్యాలను సాధించామని అనుకుంటున్నాము. ఈ విషయాన్ని ఇరానీయులు గ్రహించారో లేదో నాకు తెలియదు. మేము అనుకున్నట్టుగా ఇరాన్లోని పరిపాలనను బలహీనపరిచాము. కానీ వారు మళ్లీ పాత పరిస్థితుల్లోకి వెళ్లకుండా మేము చేసుకోవాలి. మేము క్షేత్రస్థాయిలో ఒక విభిన్నమైన వాస్తవికతను సృష్టించాలనుకుంటున్నాము’ అని డానన్ అన్నారు. ఇజ్రాయిల్ ఎల్లప్పుడూ ఈ ప్రాంతంలో శాంతిని సమర్థించింది. అయితే ఇస్లామిక్ పాలన దీనికి విరుద్ధంగా ఉందని ఇజ్రాయిల్ రాయబారి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







