ఇరాన్తో శాంతి చర్చలకు వెళ్లము: ఇజ్రాయిల్ రాయబారి డానీ డానన్
- March 25, 2026
ఇరాన్తో యుద్ధం ఆపి శాంతి చర్చలకు అమెరికా ఇజ్రాయిల్ ప్రయత్నిస్తున్నాయి అనే వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్ రాయబారి డానీ డనోస్ ఖండించారు. మంగళవారం ఐక్యరాజ్యసమితిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందకుండా చూడడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ‘ఇరాన్తో శాంతి చర్చల గురించి నాకు తెలియదు. మేము ఆపరేషన్ను కొనసాగిస్తున్నామని గమనించడం ముఖ్యం. మేము మాట్లాడుకుంటున్న ఈ క్షణంలో.. ఇజ్రాయిల్, అమెరికా.. ఇరాన్లోని సైనిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగిస్తున్నాయి. మేము దాడుల్ని కొనసాగిస్తాము. సంప్రదింపుల గురించి మాట్లాడినప్పుడు ఏదైనా ఆపరేషన్ గానీ ఘర్షణకు సంబంధించి ముగించడానికి దౌత్య మార్గాన్ని అనుసరించడమేనని మాకు తెలుసు. ఇరాన్కు అణ్వాయుధ సామర్థ్యం, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం లేకుండా చేస్తాం. అలాగే కేవలం నెల రోజుల క్రితం అనుకుని ముందుకు తెచ్చిన లక్ష్యాలను సాధిస్తామని కూడా మేము హామీ ఇస్తున్నాము. ఈ ఘర్షణల్లో మేము అనుకున్న చాలా లక్ష్యాలను సాధించామని అనుకుంటున్నాము. ఈ విషయాన్ని ఇరానీయులు గ్రహించారో లేదో నాకు తెలియదు. మేము అనుకున్నట్టుగా ఇరాన్లోని పరిపాలనను బలహీనపరిచాము. కానీ వారు మళ్లీ పాత పరిస్థితుల్లోకి వెళ్లకుండా మేము చేసుకోవాలి. మేము క్షేత్రస్థాయిలో ఒక విభిన్నమైన వాస్తవికతను సృష్టించాలనుకుంటున్నాము’ అని డానన్ అన్నారు. ఇజ్రాయిల్ ఎల్లప్పుడూ ఈ ప్రాంతంలో శాంతిని సమర్థించింది. అయితే ఇస్లామిక్ పాలన దీనికి విరుద్ధంగా ఉందని ఇజ్రాయిల్ రాయబారి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం
- హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ









