ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు

- April 03, 2026 , by Maagulf
ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు

న్యూ ఢిల్లీ: ఢిల్లీలో కీలక నిర్ణయం తీసుకున్నారు.నగరవ్యాప్తంగా గతంలో అమర్చిన సీసీ కెమెరాల్లో చాలా భాగాన్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ భద్రతకు ముప్పు ఉండే అవకాశాలు ఉన్నాయని భావిస్తూ ఈ చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియను ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేష్ సాహిబ్ సింగ్ ప్రారంభించారు. దశలవారీగా కెమెరాలను తొలగించి వాటి స్థానంలో సురక్షితమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఢిల్లీలో రెండు దశల్లో మొత్తం 2 లక్షలకుపైగా సీసీ కెమెరాలు అమర్చారు. మొదటి దశలో అమర్చిన కెమెరాలు ఎక్కువగా చైనా కంపెనీ హైక్విజన్ కు చెందినవిగా ఉన్నాయి. ఈ కంపెనీ కెమెరాలపై ప్రపంచవ్యాప్తంగా భద్రతా సంబంధిత ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సున్నితమైన సమాచారాన్ని ఇతర దేశాలకు చేరే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ కెమెరాలను తొలగించి వాటి స్థానంలో స్వదేశీ లేదా భద్రతా ప్రమాణాలు ఉన్న పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com