మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- April 03, 2026
కువైట్: కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (KNPC) నిర్వహిస్తున్న మీనా అల్-అహ్మది రిఫైనరీపై శుక్రవారం తెల్లవారుజామున డ్రోన్ దాడి జరిగింది. దీంతో ఆ ప్రాంగణంలోని పలు ఆఫరేషనల్ యూనిట్స్ లో మంటలు చెలరేగాయని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) ఒక ప్రకటనలో ప్రకటించింది. అత్యవసర మరియు అగ్నిమాపక బృందాలను వెంటనే రంగంలోకి దించినట్లు KPC తెలిపింది. ప్రత్యేక బృందాలు మంటలను అదుపులోకి తీసుకురావడానికి మరియు అవి రిఫైనరీలోని ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించడానికి సమర్థవంతంగా పనిచేశాయని తెలిపింది.ఈ ఘటనలో ఎటువంటి గాయాలు కాలేదని కార్పొరేషన్ ధృవీకరించింది.
కార్మికుల భద్రతను నిర్ధారించడానికి మరియు ప్రాంగణాన్ని కాపాడటానికి అవసరమైన అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు కూడా పేర్కొంది. రిఫైనరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి నాణ్యతను పర్యవేక్షించేందుకు పర్యావరణ ప్రజా ప్రాధికార సంస్థతో సమన్వయం చేసుకుంటున్నట్లు కేపీసీ పేర్కొంది. ఈ ఘటన ఫలితంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రతికూల పర్యావరణ ఘటన నెలకొనలేదని తెలిపింది.
నిరంతరాయ కార్యకలాపాలు కొనసాగేలా.. ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆ సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









