మోసపూరిత బీమా కంపెనీలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..!!
- April 05, 2026
దుబాయ్ః మోసపూరిత బీమా సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి చెల్లింపులు చేసే ముందు వారి లైసెన్సులు మరియు డాక్యుమెంట్స్ తనిఖీ చేసుకోవాలని దుబాయ్ పోలీసులు నివాసితులను హెచ్చరించారు. లైసెన్సు లేని సంస్థలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటున్నాయని, బాధితులను ఆకర్షించడానికి తప్పుదోవ పట్టించే ఆఫర్లను ప్రచారం చేస్తున్నాయని దుబాయ్ పోలీసులు హైలైట్ చేశారు.
ఈ నకిలీ కంపెనీలు తరచుగా మార్కెట్లో అందుబాటులో ఉన్న ధరల కంటే చాలా తక్కువ ధరలను చూపిస్తూ ప్రకటనలు ఇస్తారని వారు వివరించారు. తద్వారా ప్రొవైడర్ చట్టబద్ధత లేదా లైసెన్సును ధృవీకరించకుండానే చెల్లింపులు చేసేలా వినియోగదారులను ప్రేరేపిస్తారని పేర్కొన్నారు.
ఈ ఏడాది జనవరిలో ఆన్లైన్లో నకిలీ కార్ ఇన్సూరెన్స్ ప్రకటనల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాస్ అల్ ఖైమా పోలీసులు ప్రజలను హెచ్చరించారు. గత సంవత్సరం, సోషల్ మీడియాలో నకిలీ ఇన్సూరెన్స్ కంపెనీల బారిన పడకుండా ఉండాలని పరిశ్రమ నిపుణులు కూడా నివాసితులను హెచ్చరించారు. యూఏఈలో పనిచేస్తున్న అన్ని అధీకృత ఇన్సూరెన్స్ కంపెనీలు అధికారిక అధికారుల కఠినమైన పర్యవేక్షణ మరియు నియంత్రణకు లోబడి ఉంటాయని దుబాయ్ పోలీసులు తెలిపారు. ప్రజలు ఏదైనా అనుమానిత మోసపూరిత ప్రయత్నాలను వెంటనే ఇ-క్రైమ్ ప్లాట్ఫారమ్ ద్వారా లేదా 901 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
తాజా వార్తలు
- కత్తులతో ఘర్షణకు పాల్పడిన యువకుల గ్యాంగ్ అరెస్ట్.. వీడియో షేర్ చేసిన వ్యక్తిపైనా చర్యలు
- IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- బక్రీద్ ను శాంతియుతంగా జరుపుకోవాలి: సీపీ సుమతి
- ఒక తరం బాగుండాలనే ఆలోచన మాది: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- ప్రధాని మోదీని వైట్హౌస్కు ఆహ్వానించిన రూబియో
- స్విస్ అధ్యక్షుడికి లేఖ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- ఆరోగ్య వ్యవస్థ ఫైనాన్సింగ్పై కువైట్, డబ్ల్యూహెచ్ఓ చర్చలు..!!
- బహ్రెయిన్ అత్యంత పురాతన హోటల్ పునరుద్ధరణ..!!
- ప్రపంచ ఆర్థిక, ఆహార భద్రతపై యూఏఈ హెచ్చరిక..!!
- ప్రభుత్వ సేవల సామర్థ్యంలో ఖతార్ కు టాప్ ర్యాంక్..!!









