మోసపూరిత బీమా కంపెనీలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..!!
- April 05, 2026
దుబాయ్ః మోసపూరిత బీమా సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి చెల్లింపులు చేసే ముందు వారి లైసెన్సులు మరియు డాక్యుమెంట్స్ తనిఖీ చేసుకోవాలని దుబాయ్ పోలీసులు నివాసితులను హెచ్చరించారు. లైసెన్సు లేని సంస్థలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటున్నాయని, బాధితులను ఆకర్షించడానికి తప్పుదోవ పట్టించే ఆఫర్లను ప్రచారం చేస్తున్నాయని దుబాయ్ పోలీసులు హైలైట్ చేశారు.
ఈ నకిలీ కంపెనీలు తరచుగా మార్కెట్లో అందుబాటులో ఉన్న ధరల కంటే చాలా తక్కువ ధరలను చూపిస్తూ ప్రకటనలు ఇస్తారని వారు వివరించారు. తద్వారా ప్రొవైడర్ చట్టబద్ధత లేదా లైసెన్సును ధృవీకరించకుండానే చెల్లింపులు చేసేలా వినియోగదారులను ప్రేరేపిస్తారని పేర్కొన్నారు.
ఈ ఏడాది జనవరిలో ఆన్లైన్లో నకిలీ కార్ ఇన్సూరెన్స్ ప్రకటనల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాస్ అల్ ఖైమా పోలీసులు ప్రజలను హెచ్చరించారు. గత సంవత్సరం, సోషల్ మీడియాలో నకిలీ ఇన్సూరెన్స్ కంపెనీల బారిన పడకుండా ఉండాలని పరిశ్రమ నిపుణులు కూడా నివాసితులను హెచ్చరించారు. యూఏఈలో పనిచేస్తున్న అన్ని అధీకృత ఇన్సూరెన్స్ కంపెనీలు అధికారిక అధికారుల కఠినమైన పర్యవేక్షణ మరియు నియంత్రణకు లోబడి ఉంటాయని దుబాయ్ పోలీసులు తెలిపారు. ప్రజలు ఏదైనా అనుమానిత మోసపూరిత ప్రయత్నాలను వెంటనే ఇ-క్రైమ్ ప్లాట్ఫారమ్ ద్వారా లేదా 901 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







