డ్రైవర్లను హెచ్చరించిన కువైట్..!!
- May 29, 2026
కువైట్: కువైట్ రహదారులపై వేగ పరిమితిని ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు తన "X" ప్లాట్ఫామ్లో ఒక ప్రకటన జారీ చేసింది. గంటకు 150 కిలోమీటర్లకు మించి వేగంతో వాహనం నడుపుతూ పట్టుబడిన పౌరులు ట్రాఫిక్ ఉల్లంఘన మరియు వాహన జప్తును ఎదుర్కొంటారని, అదే ప్రవాసులు అయితే ట్రాఫిక్ ఉల్లంఘన, వాహన జప్తుతోపాటు దేశ బహిష్కరణను ఎదుర్కొంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
గంటకు 170 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్లే పౌరులు ట్రాఫిక్ ఉల్లంఘన, వాహన జప్తు మరియు వాహనాన్ని తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంటామని, ప్రవాసులపై ట్రాఫిక్ ఉల్లంఘన, వాహన జప్తు మరియు దేశ బహిష్కరణ వేటు పడుతుందని తెలిపింది.
గంటకు 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వాహనాలు నడిపే పౌరులకు ట్రాఫిక్ ఉల్లంఘన, వాహనం జప్తు మరియు జైలు శిక్ష విధిస్తామని, ప్రవాసులకు మాత్రం ట్రాఫిక్ ఉల్లంఘన, వాహనం జప్తు మరియు దేశ బహిష్కరణ ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!
- ఫిఫా వరల్డ్ కప్ సెమీస్లో ఫ్రాన్స్ పై స్పెయిన్ ఘన విజయం
- 77వ వసంతంలోకి అడుగుపెట్టిన దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్
- సెప్టెంబర్ తో ముగియనున్న దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!!
- కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!







