డ్రైవర్లను హెచ్చరించిన కువైట్..!!
- May 29, 2026
కువైట్: కువైట్ రహదారులపై వేగ పరిమితిని ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు తన "X" ప్లాట్ఫామ్లో ఒక ప్రకటన జారీ చేసింది. గంటకు 150 కిలోమీటర్లకు మించి వేగంతో వాహనం నడుపుతూ పట్టుబడిన పౌరులు ట్రాఫిక్ ఉల్లంఘన మరియు వాహన జప్తును ఎదుర్కొంటారని, అదే ప్రవాసులు అయితే ట్రాఫిక్ ఉల్లంఘన, వాహన జప్తుతోపాటు దేశ బహిష్కరణను ఎదుర్కొంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
గంటకు 170 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్లే పౌరులు ట్రాఫిక్ ఉల్లంఘన, వాహన జప్తు మరియు వాహనాన్ని తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంటామని, ప్రవాసులపై ట్రాఫిక్ ఉల్లంఘన, వాహన జప్తు మరియు దేశ బహిష్కరణ వేటు పడుతుందని తెలిపింది.
గంటకు 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వాహనాలు నడిపే పౌరులకు ట్రాఫిక్ ఉల్లంఘన, వాహనం జప్తు మరియు జైలు శిక్ష విధిస్తామని, ప్రవాసులకు మాత్రం ట్రాఫిక్ ఉల్లంఘన, వాహనం జప్తు మరియు దేశ బహిష్కరణ ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి, టీడీపీ మహానాడు వేడుకలు
- భారత దేశవ్యాప్తంగా ఒకే హెల్ప్లైన్ నెంబర్..సుప్రీం ఆదేశం
- ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు వర్ష సూచన
- సంక్షేమ పథకాల్లో డిజిటల్ కరెన్సీ..RBI కీలక యోచన
- కువైట్పై ఇరాన్ దాడులను ఖండించిన యూఏఈ, కువైట్ విదేశాంగ మంత్రులు
- ఇక NIMSలో రూ.80 వేల జన్యు పరీక్షలు ఉచితం!
- దురాక్రమణను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్..!!
- థియేటర్లలో ఫైర్ ఫోర్స్ సేఫ్టీ తనిఖీలు..!!
- నిజాయితిని చాటిన భారత ప్రవాసుడు.. Dh100,000 అప్పగింత..!!
- ఆసుపత్రులలో చేరిన, తప్పిపోయిన యాత్రికులను గుర్తించడానికి డ్రైవ్..!!









