ఎబోలా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేసిన యూఏఈ..!!
- June 06, 2026
యూఏఈ: ఎబోలా వైరస్ వ్యాప్తిని నివారించడానికి యూఏఈ అధికారులు కొత్త ముందుజాగ్రత్త చర్యలను ప్రకటించారు. ఎబోలా ప్రభావిత మూడు దేశాలైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా మరియు దక్షిణ సూడాన్లకు చెందిన పౌరులకు కొత్త వీసాల జారీని నిలిపివేశారు.
జాతీయ అత్యవసర సంక్షోభ మరియు విపత్తుల నిర్వహణ అథారిటీ (NCEMA) మరియు ఐడెంటిటీ, సిటిజన్షిష్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ ఫెడలర్ అథారిటీ (ICP) ఈ అదనపు ముందుజాగ్రత్త చర్యలను ప్రకటించాయి. వీసా సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది.
జాబితాలో ఉన్న దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు, అలాగే ఇతర దేశాల మీదుగా ట్రాన్సిట్ ద్వారా ప్రయాణించే వారికి కూడా యూఏఈలోకి ప్రవేశం పరిమితం చేయబడుతుందని స్పష్టం చేసింది. యూఏఈకి రాకముందు, జాబితాలో ఉన్న దేశాల వెలుపల 21 రోజుల కంటే ఎక్కువ కాలం గడిపిన ప్రయాణికులకు మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. అయితే, కార్గో విమాన సర్వీసులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







