ఎబోలా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేసిన యూఏఈ..!!
- June 06, 2026
యూఏఈ: ఎబోలా వైరస్ వ్యాప్తిని నివారించడానికి యూఏఈ అధికారులు కొత్త ముందుజాగ్రత్త చర్యలను ప్రకటించారు. ఎబోలా ప్రభావిత మూడు దేశాలైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా మరియు దక్షిణ సూడాన్లకు చెందిన పౌరులకు కొత్త వీసాల జారీని నిలిపివేశారు.
జాతీయ అత్యవసర సంక్షోభ మరియు విపత్తుల నిర్వహణ అథారిటీ (NCEMA) మరియు ఐడెంటిటీ, సిటిజన్షిష్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ ఫెడలర్ అథారిటీ (ICP) ఈ అదనపు ముందుజాగ్రత్త చర్యలను ప్రకటించాయి. వీసా సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది.
జాబితాలో ఉన్న దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు, అలాగే ఇతర దేశాల మీదుగా ట్రాన్సిట్ ద్వారా ప్రయాణించే వారికి కూడా యూఏఈలోకి ప్రవేశం పరిమితం చేయబడుతుందని స్పష్టం చేసింది. యూఏఈకి రాకముందు, జాబితాలో ఉన్న దేశాల వెలుపల 21 రోజుల కంటే ఎక్కువ కాలం గడిపిన ప్రయాణికులకు మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. అయితే, కార్గో విమాన సర్వీసులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- UNFCCC ఫ్రేమ్వర్క్ లో చేరిన లూసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్..!!
- యువ ఆవిష్కర్తల గొప్ప ఆలోచనలు..!!
- భద్రత, రక్షణ సంబంధాలపై కువైట్, జోర్డాన్ చర్చలు..!!
- ఇంపోర్టెట్ గూడ్స్ కు ప్యాలెట్ల వినియోగం తప్పనిసరి..!!
- ఎబోలా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేసిన యూఏఈ..!!
- సౌదీలో విజిల్బ్లోయర్లు, సాక్షులు, బాధితుల ప్రొటెక్షన్ ప్రోగ్రామ్..!!
- నార్వే చెస్ చాంపియన్ ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు!
- ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- సహారా ఎడారిలో తీవ్ర విషాదం..నీళ్లు దొరక్క 49 మంది మృతి









